జానీ మాస్టర్ కేసులో ఊహించని మలుపులు.. తెరపైకి కొత్త నిజాలు..!?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ టాలీవుడ్ ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా నిన్న గురువారం ఆయన్ని గోవాలో అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున జానీ మాస్టర్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురాగా ఆయన్ని నార్సింగి డీసీపీ ఆఫీసులో రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.  కాగా నిన్న జానీ మాస్టర్ భార్య ఆయేషా అలియాస్ సుమలతను కూడా పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారమే.. జానీ మాస్టర్‌ను గోవాలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

 అయితే జానీ మాస్టర్ భార్య ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో షాకింగ్ విషయాలు చెప్పారు. జానీ మాస్టర్ ఇండస్ట్రీలో ఎదగకూడదు అని కావాలని ఇలా చేస్తున్నట్టు చెప్పిన ఆమె బాధితురాలిపై ఊహించని స్థాయిలో ఆరోపణలు చేశారు. అసలు ఆ అమ్మాయికి ట్యాలెంట్ ఉందనే ఉద్దేశ్యంతోనే ఆమెకు అసిస్టెంట్ కొరియోగ్రఫీ అవకాశం ఇచ్చినట్టు చెప్పారు.  అయితే ఈ క్రమంలో జానీ మాస్టర్ మీద మరిన్ని ఫిర్యాదులు అందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.  టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు మరో ఇద్దరు డాన్సర్లు కూడా బయటకు వచ్చి మరిన్ని షాకింగ్ విషయాలు జానీ మాస్టర్ గురించి

 బయట పెట్టబోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతున్న మన దాని మేరకు ఆయన చాలామంది ఫిమేల్ అసిస్టెంట్లను ఇలాగే ఇబ్బంది పెట్టేవాడు అని అంటున్నారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ తరఫునుంచి కానీ డాన్సర్ల తరపు నుంచి కానీ ఎవరూ అసలు ఈ విషయం మీద మాట్లాడవద్దు అంటూ డాన్సర్ల గ్రూపులో పెట్టిన ఒక ఆడియో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది జానీ మాస్టర్ మీద ఎవరైనా ఫిర్యాదు చేయబోతున్నారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: