సాలిడ్ లినప్ ను సెట్ చేసుకున్న శర్వా.. లైన్ లో ఆ ముగ్గురు బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి శర్వానంద్ కొంత కాలం పాటు వరుస ఆపజాయలను ఎదుర్కొన్నాడు. ఇక వరుస అపజయలతో డీలా పడిపోయి ఉన్నా శర్వానంద్ కొంత కాలం క్రితం ఒకే ఒక జీవితం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సంవత్సరం శర్వా "మనమే" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా వరుసగా రెండు విజయాలను అందుకొని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న శర్వానంద్ తన తదుపరి మూవీ లను కూడా అదిరిపోయే రేంజ్ లో సెట్ చేసుకున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం శర్వానంద్ తన కెరీర్ లో 36 వ మూవీ గా లూసర్ వెబ్ సిరీస్ దర్శకుడు అయినటువంటి అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తో పాటు శర్వా 37 అనే వర్కింగ్ టైటిల్ తో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇకపోతే తాజాగా శర్వానంద్ మరో మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సంపత్ నంది దర్శకత్వంలో శర్వా తన కెరియర్లో 38 వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మించనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూడు మూవీ లపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: