మత్తు వదలరా 2 : కలెక్షన్స్ అంటే ఇవి.. మూడు రోజుల్లోనే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు శ్రీ సింహ హీరోగా ఫరియ అబ్దుల్లా హీరోయిన్గా టాలెంటెడ్ డైరెక్టర్ రితీష్ రానా దర్శకత్వంలో సత్య కీలక పాత్రలో మత్తు వదలరా 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 13 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
3 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 2.31 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 2.32 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.63 కోట్ల షేర్ , 8.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 3  రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 62 లక్షలు ,  ఓవర్సీస్ లో 2.45 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో 7.70 కోట్ల షేర్ , 15.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 8 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ సినిమా 8.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 80 లక్షల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ ఈజీగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలను అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: