అత్యంత ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసిన పృథ్వీరాజ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ కావాల్సిందే..?

Pulgam Srinivas
ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అనేక విజయాలను అందుకని మలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో పృథ్విరాజ్ , ప్రభాస్ కి స్నేహితుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించింది.

ఈ మూవీ రెండవ భాగం కూడా మరి కొంత కాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా పృథ్వీరాజ్ ఒక అత్యంత విలాస వంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. పృథ్వీరాజ్ ముంబైలోని బాంద్రా పాళీ హిల్ ప్రాంతంలో అత్యంత విలాసమైన డూప్లెక్స్ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. తన ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఈ భవనాన్ని ఈయన కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ అత్యంత విలాసవంతమైన భవనం ఖరీదు 30.6 కోట్లు అని తెలుస్తుంది.

ఇక ఇదే ప్రాంతంలో ఆయన భార్య సుప్రియ మీనన్ పేరు మీద రూపాయలు 17 కోట్ల విలువైన మరో అపార్ట్మెంట్ ఇప్పటికే వీరికి కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే భవనం కలిగి ఉన్న ప్రాంతంలోనే మరో విలాసవంతమైన భవనాన్ని పృధ్వీరాజ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం పృధ్వీరాజ్ "ది గోట్ లైఫ్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: