ఆ ఫ్లాప్ సినిమా కారణంగా టాలివుడ్ కి దూరం కానున్న మృణాల్..!?

Anilkumar
తెలుగు సినిమాలకు కాస్త బ్రేక్‌నిచ్చిన మరాఠీ సుందరి మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. అక్కడ నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వాటిలో అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ నిర్మిస్తున్న సినిమాపై మృణాల్‌ ఠాకూర్‌ ఎన్నో ఆశల్ని పెట్టుకుంది. సిద్ధార్థ్‌ చతుర్వేది హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రవి ఉద్యవార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాల్ని అద్భుత రీతిలో తెరకెక్కిస్తుంటారు సంజయ్‌లీలా భన్సాలీ.  ఈ సినిమా తన బాలీవుడ్‌ కెరీర్‌కు బ్రేక్‌నిస్తుందనే నమ్మకంతో ఉంది మృణాల్‌. తాజాగా ఈ సినిమాకు ‘తూ హీ హో..’ అనే పేరును ఖరారు చేశారు. 

ఈ సినిమాలో నాయకానాయికలు సిద్ధార్థ్‌ చతుర్వేది, మృణాల్‌ ఠాకూర్‌ ఇద్దరూ మ్యూజిషియన్స్‌గా కనిపిస్తారని, మనసుల్ని కదిలించే సంగీతభరిత ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని సుందరమైన లొకేషన్లలో తదుపరి షెడ్యూల్‌ కోసం సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ తెలిపారు. ఇకపోతే సీతా రామం తో మొదలైన ఈమె జర్నీ.. హాయ్ నాన్నతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. రెండు లతోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ అయిపోయారు ఈ భామ. కానీ ఒక్క తోనే మృణాళ్ జాతకం అంతా మారిపోయింది. ప్రస్తుతానికి ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది. అక్కడ ఒక్క

 హిట్టు కూడా లేకపోయినా..   మరాఠీ సుందరి  మృణాళ్‌ను బాగానే ఆదరిస్తున్నారు. సిద్దాంత్ చతుర్వేది హీరోగా నటించబోయే ఈ చిత్రానికి రవి ఉద్యావర్ దర్శకుడు. దాంతో పాటు మరో రెండు లు కూడా చేస్తున్నారు. వీటి కోసమే సౌత్ ల వైపు చూడట్లేదు మృణాళ్. ఇక తెలుగులో విజయ్ దేవరకొండతో నటించిన ఫ్యామిలీ స్టార్‌ దారుణంగా నిరాశ పరచడంతో  మరాఠీ సుందరి  మృణాళ్ ఠాకూర్‌ జాతకం తిరగబడింది. ఆ తర్వాత ఈమె తెలుగు ఇండస్ట్రీని పట్టించుకోవట్లేదా లేదంటే మనోళ్లే ఈమెను పట్టించుకోవట్లేదా అనేది అర్థం కావట్లేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: