మహేష్ బాబు : నా సినిమాలను అక్కడ డబ్ చేయకండి..!!

murali krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందనున్న ఈ సినిమా ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరి కొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా విషయంలో మహేష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ వైపు తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకుని ఫిజిక్ పై దృష్టి సారించారు. అభిమానులు తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తుండటం కామన్. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రం సినిమా ప్రారంభోత్సవం కోసమే ఎంతో ఆశగా ఎదురుచుస్తున్నారు.రాజమౌళి మహేష్ ల కాంబోకి అంతటి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు మూవీ గురించి అధికారంగా ఎలాంటి అప్ డేట్స్ రాకపోయినా కూడా మహేష్, జక్కన్న ఇద్దరు మూవీకి సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఈ టైంలో ఇప్పటి వరకు తనతో సినిమాలని నిర్మించిన నిర్మాతలందరిని మహేష్ ఒక కోరిక కోరుతున్నాడనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మహేష్, జక్కన్నల మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. జక్కన్న కూడా ఆర్ఆర్ఆర్ ని మించిన సక్సెస్ ని అందుకోవాలనే కసితో మూవీకి సంబంధించిన ప్రతి అంశంలోను జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్  హిందీ చిత్ర సీమలో ఎంతగా విజయం  సాధించిందో అందరకి తెలిసిన విషయమే.పైగా అక్కడి ఆడియన్స్ కూడా  జక్కన్న సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ కారణంతో కూడా జక్కన్న ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విషయం మీదనే మహేష్ తన నిర్మాతలకి ఒక విన్నపం చేస్తున్నాడు. జక్కన్న సినిమాతోనే  బాలీవుడ్ కి పరిచయం అవ్వాలని కోరుకుంటున్నాడు.
దీంతో తన గత చిత్రాల్లో వేటిని కూడా హిందీ లాంగ్వేజ్ లోకి  డబ్ చెయ్యద్దని ఆయా చిత్ర నిర్మాతలని కోరుతున్నాడు. బాలీవుడ్ ప్రేక్షకులు జక్కన్న మూవీ తోనే తనని రిసీవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.రాజమౌళి కూడా మహేష్ నిర్ణయానికి ఒకే అన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా తెలుగు సినిమాలు హిందీ లోకి  డబ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక మహేష్, జక్కన్న మూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో జరిగే కథ అనే వార్త చాలా రోజుల నుంచి వస్తూనే ఉంది.జక్కన్న తన ఆనవాయితీ ప్రకారం ప్రెస్ మీట్ పెట్టి చెప్తే గాని అసలు విషయం తెలియదు. ఇక ఎస్‌ఎస్‌ఎంబీ 29 విష‌యానికి వ‌స్తే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు వి.విజయేంద్ర ప్రసాద్ క‌థ‌ను అందిస్తుండ‌గా ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ.. వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌ వైజర్‌గా ఆర్‌.సి.కమల్ కణ్ణన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్‌గా రమా రాజమౌళి ప‌ని చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. వ‌చ్చే నెల‌లో మూవీ కూడా లాంచ్ అవ్వ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఇండోనేషియాకు చెందిన హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ ఇందులో హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: