ఆ హీరోయిన్ పై మోజు పడ్డ సాయి ధరమ్ తేజ్.. పబ్లిక్ గా రొమాన్స్ చేస్తూ.?

Pandrala Sravanthi
 మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఎఫైర్స్ చెప్పగానే రాశిఖన్నా, రెజీనా, లారీస్సా బోనేసి వంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తాయి. అయితే ఈ హీరోయిన్ ల పేర్లు వినిపించడానికి ప్రధాన కారణం సాయి ధరంతేజ్ కి ఆ హీరోయిన్లతో డేటింగ్ వార్తలు వినిపించడమే.. మాస్ సినిమాలు తీస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్న ఈ కుర్ర హీరో మనం చెప్పుకునే ముగ్గురు హీరోయిన్లతో కాకుండా మరో హీరోయిన్ పై మనసు పడ్డారట. ఆ హీరోయిన్ తో పిచ్చెక్కించే రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు అందాల నటి బోల్డ్ బ్యూటి ప్రగ్యా జైస్వాల్..ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించింది.

అలా  అఖండ, ఆచారి అమెరికా యాత్ర, గుంటూరోడు,ఓం నమో వెంకటేశాయా,  కంచె వంటి సినిమాల్లో నటించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ తో సాయిధరమ్ తేజ్ డేటింగ్ చేస్తున్నారంటూ అప్పట్లో టాలీవుడ్ మీడియా ఎంతలా కొడై కొసిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ రూమర్లు రావడానికి ప్రధాన కారణం కంచె సినిమాలో చేసే సమయంలో వరుణ్ తేజ్ షూటింగ్ కి అప్పుడప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా వెళ్లేవారట.

ఆ టైంలో ప్రగ్యాతో మంచి పరిచయం పెంచుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవారట.అంతే కాకుండా రెజీనా సందీప్ కిషన్ కాంబినేషన్లో వచ్చిన నక్షత్రం మూవీలో సాయి ధరమ్ తేజ్ ప్రగ్యా జైస్వాల్ ఇద్దరూ గెస్ట్ రోల్స్ పోషించారు.ఇక ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ వేరే లెవెల్ లో ఉంటుంది.అయితే వీరిద్దరూ అంత ఘాటుగా రొమాన్స్ చేసుకోవడానికి కారణం వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యమే అని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం మాత్రం వీరి రిలేషన్ కొనసాగడం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: