మొదటిసారి అలాంటి రిస్క్ చేస్తున్న నిఖిల్.. ఈసారి విన్ అవుతాడా..!?

Anilkumar
నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకోవడంతో ఇప్పుడు వరుస భారీ సినిమాలను లైన్లో పెట్టాడు. నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభు’ సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియో నిర్మాణంలో భువన్, శంకర్ నిర్మాతలుగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ స్వయంభు సినిమా తెరకెక్కుతుంది. సంయుక్త, నభా నటేష్ లు హీరోయిన్స్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న స్వయంభులో నిఖిల్ ఓ లెజెండరీ యోధుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ తో సినిమాపై అంచనాలు

 నెలకొన్నాయి. అయితే దర్శకుడు భరత్ కృష్ణమాచారికి  ఇదే మొదటి సినిమా. నిజానికి ఈ సినిమాని 50 కోట్ల బడ్జెట్ లో కంప్లీట్ చేయాలని అనుకున్నారంట. అయితే ప్రస్తుతం 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి 80 కోట్ల వరకు ఖర్చవుతునట్లు టాక్ వినిపిస్తోంది.  అంటే నిఖిల్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ స్వయంభు సినిమాకి ఖర్చు చేస్తున్నారు. మిగిలిన 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి బడ్జెట్ 100 కోట్లు దాటిపోవచ్చని అంటున్నారు. అదే జరిగితే నిఖిల్ కెరియర్ లో స్వయంభు చాలా పెద్ద రిస్కీ ప్రాజెక్ట్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్ లెక్కల ప్రకారం చూసుకుంటే అతనిపై 30 కోట్ల బిజినెస్ నడుస్తోంది.

 స్వయంభు పీరియాడికల్ కంటెంట్ కాబట్టి ఒక 50 కోట్ల వరకు బిజినెస్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అంతకు మించి డిస్టిబ్యూటర్స్ నిఖిల్ పై డిస్టిబ్యూటర్స్ రిస్క్ చేయకపోవచ్చు. కార్తికేయ 2 బడ్జెట్ తో పోల్చుకుంటే స్వయంభుకి 3 రేట్లు ఎక్కువ అవుతోంది. కచ్చితంగా నిఖిల్ కెరియర్ లో ఇది హై రిస్క్ మూవీ అనే మాట వినిపిస్తోంది. ఇక  పాన్ ఇండియా ఇమేజ్ తో నిఖిల్ చేసిన స్పై మూవీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఇక ఈ సారి చేయబోయే సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో నిఖిల్ ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: