టీజర్: మత్తు వదలరా -2 సినిమాతో నైనా ఫరియాకు సక్సెస్ అందుకునేనా..?

Divya
కీరవాణి చిన్న కుమారుడు సింహ కోడూరు హీరోగా నటించిన చిత్రం మత్తు వదలరా.. ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ కూడా ఈ చిత్రానికి బాగానే ప్రమోషన్ చేయడంతో బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా కామెడీ త్రిల్లర్ సస్పెన్స్ గా వచ్చిన మత్తు వదలరా సినిమా ఎండింగ్ చివర్లోనే ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని విషయాన్ని ప్రకటించారు. అన్నట్టుగానే మత్తు వదలరా-2 సీక్వెల్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నామని తెలియజేశారు. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం.

అయితే ఇందులో హీరోయిన్గా ఈసారి ఫరియా అబ్దుల్లాని ఫిమేల్ లీడ్ రోల్ తీసుకున్నారు. జాతి రత్నాలు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకి మరే సినిమా కూడా పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ కూడా సక్సెస్ను ఇవ్వలేదు. కొన్ని చిత్రాల స్పెషల్ సాంగ్ లలో మాత్రమే నటించింది. మత్తు వదలరా-2 లో ఫరియా పాత్ర మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో నైనా ఈమె సక్సెస్ ని అందుకుంటుందేమో చూడాలి టీజర్ ను కూడా అద్భుతంగా చూపించారు.

అలాగే సత్య , వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి ,ఝాన్సీ, శ్రీనివాసరెడ్డి తదితరునటీనటులు అందరూ కూడా ఇందులో నటిస్తూ ఉన్నారు. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమా రాబోతున్నట్టుగా కనిపిస్తోంది. మత్తు వదలరా-2 టీజర్ కూడా హిలేరియస్ గా ఉందంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీ సింహ కూడా మరొకసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. టీజర్ తో ఈ సినిమా హైప్ ని పెంచేశారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో ఎంతమంది తలరాతలు మారుతాయి అని చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: