ఖరీదైన బంగ్లాను అమ్మకానికి పెట్టిన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే..?

Divya
ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్లు తమ ఖరీదైన ఆస్తులను అమ్మకానికి పెడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే హీరో విజయ్ తన లగ్జరీ కారు రోల్స్ రాయల్స్ ను అమ్మకానికి పెట్టగా, బాలీవుడ్ బ్యూటీ కంగనా రణౌత్ తన ఖరీదైన 40 కోట్ల రూపాయల విలువ చేసే బంగ్లాన్ని కూడా అమ్మకానికి పెట్టింది. ఇప్పుడు వీరి బాటలోనే సోనాక్షి సిన్హా కూడా చేరబోతోంది. ఈ మధ్య జూన్ 23న తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ తో ఏడడుగులు వేసిన ఈమె. ఈ వివాహ వేడుక ముంబై లోని బాంద్రా ఏరియాలో ఉన్న తన అపార్ట్మెంట్లోని జరిగింది. ఇప్పుడు ఈ ఇంటిని ఈమె అమ్మకానికి పెట్టేసింది. అయితే ఈ విషయాన్ని సోనాక్షి సిన్హా బహిరంగంగా ప్రకటించలేదు. కానీ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ పోస్ట్ చేసిన వీడియో కారణంగా ఇది కాస్త బయటకి వచ్చింది.
సోనాక్షి సిన్హా ఎవరో కాదు ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా కూతురే. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ చిత్రంతో నటిగా కెరియర్ మొదలుపెట్టిన ఈమె దక్షిణాదిలో కూడా రజినీకాంత్ హీరోగా నటించిన లింగ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈమె గతంలో తనతో పాటు నటించిన జహీర్ ఇక్బాల్ తో ప్రేమలో పడి ఈ యేడాది పెళ్లి చేసుకుంది. 2020లో బాంద్రాలో ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సోనాక్షి  అదే బిల్డింగ్ లో ఉంటుంది.
అంతేకాదు ఇటీవల దాని పక్కన మరో అపార్ట్మెంట్ ని కూడా కొనుగోలు చేసింది. తాజాగా అందులోనే తన పెళ్లిని కూడా గ్రాండ్గా జరుపుకుంది.  ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ రూ .25 కోట్ల బేరానికి పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. పెళ్లి జరిగిన తర్వాత అందులోనూ తమ పెళ్లి జరిగిన ఆ ఇంటిని ఎందుకు అమ్మాలనుకుంటుంది అనే విషయాలు తెలియక అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: