ప్రముఖ గాయని పి సుశీలకు అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు..!

Divya
ప్రముఖ గాయని పి సుశీల ఎన్నో అద్భుతమైన పాటలు  అందించింది.. అయితే నిన్నటి రోజున సాయంత్రం వేళ అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది. దీంతో వెంటనే  కావేరి ఆసుపత్రికి తరలించి మరి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. వయోభారంతో గత కొంతకాలంగా ఈమె వృద్ధాప్య సమస్యలను కూడా వెంటాడుతున్నాయట. నిన్నటి రోజున కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారట. వైద్యులు వెంటనే చికిత్స అందించగా ఇది మామూలు కడుపు నొప్పి  అని తెలియజేస్తూ.. అభిమానులు ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదంటూ తెలియజేశారట. ప్రస్తుతం ఈమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలియజేశారు.

పద్మ భూషణ్ గ్రహీత అయిన పి సుశీల తెలుగులో ఎన్నో చిత్రాలలో అద్భుతమైన పాటలు పాడింది. ఈమె తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్ వంటి తొమ్మిది భాషలలో ఏకంగా 40 వేలకు పైగా పాటలు పాడడం జరిగింది. తన అద్భుతమైన స్వరంతో అభిమానులను ఆకట్టుకున్న సుశీల ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా కూడా జాతీయ అవార్డులను అందుకున్నది. అయితే గత కొంతకాలంగా ఇమే వయసు పెరగడంతో పాటలు పాడడం మానేసింది. కేవలం ఇంటికే పరిమితమైంది సుశీల.

అయితే అభిమానులు మాత్రం ఇమే ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విషయం తెలియగానే కాస్త ఆందోళన చెందారు. కానీ వైద్యులు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని తెలియజేయడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు త్వరగానే ఈమె కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక కుటుంబ సభ్యులు స్నేహితులు సైతం సోషల్ మీడియా వేదికగా పలు రకాల పోస్టులు సైతం షేర్ చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా సుశీల ఆరోగ్య గురించి ఎలాంటి వదంతులు వచ్చిన ఎవరు నమ్మవద్దండి అంటూ తెలియజేస్తున్నారు. త్వరలోనే మరింత సమాచారాన్ని కూడా తెలియజేస్తామంటూ వెల్లడించారు. ఈ విషయం వైరల్ గా మారుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: