దేవర సాంగ్ పై ఫ్యాన్ కామెంట్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి..!!

murali krishna
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”..ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ “జాన్వికపూర్” ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.దేవర సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న దసరా కనుక ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్ నేడు రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.ఈ సాంగ్ అనౌన్స్ మెంట్ వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుంచి మేక‌ర్స్ వ‌రుసగా అప్డేట్స్ ఇస్తూ సోషల్ మీడియా లో సంద‌డి చేస్తున్నారు. ఈ పాట ఓ రొమాంటిక్ మెలోడీగా రానుందని మేక‌ర్స్ ఇప్ప‌టికే రివీల్ చేశారు. ”చుట్ట‌మ‌ల్లె” అనే చ‌ర‌ణంతో సాగే ఈ పాట‌కు సంబంధించి తాజాగా మ‌రో కొత్త పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ లో ఎన్టీఆర్, జాన్వీ క‌పూర్ లు క్యూట్ అండ్ రొమాంటిక్ గా ఉండ‌టంతో అభిమానులు ఈ పాట కోసం మరింత ఆతృత‌గా చూస్తున్నారు.అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించారు. ఇక ఈ సాంగ్ ను నేడు సాయంత్రం 5.04 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్నారు. ఈ పాట అభిమానుల‌ను ఎంత‌లా ఆక‌ట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు ఇలాంటి పాట వచ్చి చాలా కాలం అయిందని గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి సోషల్ మీడియాలో పేర్కొనగా ఓ నెటిజన్ ఆయనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు."ఇంత హైప్ ఇస్తున్నారు అంతలా లేకపోతే మీకు ఉంటుంది సార్" అని హెచ్చరించాడు. దానిపై శాస్త్రి స్పందించారు. "హైప్ కాదు నిజం" సాయంత్రం మళ్లీ చెప్పు ఇక్కడే ఉంటా అని అతడికి కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ ట్రోల్స్ పై లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి స్పందించి ఆయన సోషల్ మీడియా ద్వారా సదరు నెటిజన్ కు ఈ విధంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు".

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: