డబుల్ ఇస్మార్ట్: లైగర్ మిస్టేక్ చెయ్యకుండా బాగానే జాగ్రత్త పడ్డ పూరీ?

Purushottham Vinay

 రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కలయికలో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగష్టు 15 వ తేదీన థియేటర్స్ లోకి రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో మొత్తం ఐదు భాషలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు.రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తూ ఉండటంతో డబుల్ ఇస్మార్ట్ పైన ఎక్స్ పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.మణిశర్మ చాలా కాలం తర్వాత బెస్ట్ సాంగ్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీగా ప్రేక్షకుల ముందుకి డబుల్ ఇస్మార్ట్ మూవీ రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి ప్లానింగ్ జరుగుతోంది. ఈ సినిమా థీయాట్రికల్ రైట్స్ ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి మొత్తం 55 కోట్లకి అన్ని భాషలకి కలిపి కొనుగోలు చేసారంట. ఇప్పుడు నాన్ థీయాట్రికల్ రైట్స్ కూడా అమ్ముడైపోయాయని సమాచారం తెలుస్తోంది. 


ఈ మూవీకి ఏకంగా 76 కోట్లు నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా పూరి టీమ్ కి వచ్చినట్లు సమాచారం తెలుస్తుంది. సౌత్ భాషల డిజిటల్ రైట్స్ అన్ని కలిపి 33 కోట్ల భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం. హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ మొత్తం కలిపి 35 కోట్లకి వెళ్లాయట. ఆడియో రైట్స్ ని 8 కోట్లకి అమ్మినట్లు సమాచారం తెలుస్తోంది. ఇక ఈ లెక్కన మొత్తం నాన్ థీయాట్రికల్ బిజినెస్ ద్వారా పూరి కనెక్ట్స్ కి మొత్తం 76 కోట్ల ఆదాయం వచ్చినట్లు అర్ధమవుతోంది.పెట్టిన పెట్టుబడి దాదాపు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే రికవరీ అయినట్లు సమాచారం తెలుస్తోంది. అంటే మేకర్స్ టేబుల్ ప్రాఫిట్ లోనే సేఫ్ జోన్ లోనే ఉన్నారని తెలుస్తుంది. రామ్ పోతినేని కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ డబుల్ ఇస్మార్ట్ మూవీకి జరిగింది. థీయాట్రికల్, నాన్ థీయట్రికల్ బిజినెస్ కలిపితే 130+ కోట్ల వరకు లెక్కలు తేలాయని సమాచారం. అయితే పూరీ జగన్నాథ్ మాత్రం లైగర్ కి చేసినంత ఓవర్ యాక్షన్ చెయ్యకుండా ఈ సినిమా విషయంలో బాగానే జాగ్రత్త పడ్డాడు. అందుకే ప్రమోషన్స్ అంతా కూడా సింపుల్ గా చేసేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: