భాగ్యశ్రీ బోర్సే : రవితేజ హీరోయిన్ కు మరో క్రేజీ ఆఫర్.. ఏకంగా ఆ స్టార్ హీరోతో..?

murali krishna
సినీ హీరోయిన్లకు అందం ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలని అంటారు.. ఒక్క సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి.. మొన్నటివరకు శ్రీలీలా పేరు తెగ ట్రెండ్ అవుతుంది.. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు టాలీవుడ్ బాగా వినిపిస్తుంది.. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది భాగ్యశ్రీ బోర్సే.ఇక ఈ అమ్మడు ఓ యాడ్ లో నటించి సినిమాలో ఛాన్స్ లను అందుకుంది.. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్‌తో ఈ బ్యూటీ ఎక్కువగా ఫేమస్ అయింది. యారియాన్ 2లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన హరీష్ శంకర్ రవితేజ పక్కన జోడిగా ఫిక్స్ చేశాడు.. అలా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది..ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కావడం విశేషం.ఇక ఈ చిత్రం కాకుండా భాగ్యశ్రీకి మరో ఆఫర్ కూడా దక్కినట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలో భాగ్యశ్రీని తీసుకోబోతున్నట్లుగా టాక్ ఉంది.అలానే సుజీత్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఇటీవల ఓ సినిమా ప్రకటించారు. ఈ చిత్రంలో కూడా భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయట. అన్నీ కుదిరితే నాని-సుజీత్ సినిమా ఛాన్స్ కూడా ఈ బ్యూటీ దక్కించుకునే అవకాశం ఉంది. ఇలా డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ.ఇప్పటికే ఈ భామ హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్గా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక రకంగా తెలుగులో మొదటి సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే ఆమె ఏకంగా విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా లీక్ చేసినట్లయింది. ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాయి కొలంబోలో ఉన్నట్టు వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె ఈ విజయ్ దేవరకొండ 12వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: