లారెన్స్ కోసం శ్రీకారం డైరెక్టర్.. వెరైటీ కాంబో..!

shami
కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా మారిన లారెన్స్ వెరైటీ కథలతో ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తున్నాడు. లారెన్స్ సినిమా అంటే డిఫరెంట్ గా ఉంటుందని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయ్యారు. కాంచన సీరీస్ లతో ప్రేక్షకులను భయపెట్టిన లారెన్స్ ఆ సీరీస్ లకు కొంత గ్యాప్ ఇచ్చి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్యనే జిగర్గండా డబుల్ ఎక్స్ తో వచ్చిన లారెన్స్ ఇప్పుడు ఒకేసారి 7 సినిమాల దాకా సెట్స్ మీద ఉంచాడని తెలుస్తుంది.
లారెన్స్ కోసం తెలుగు దర్శకుడు కిశోర్ ఒక కథ సిద్ధం చేశాడట. చెన్నై వెళ్లి లారెన్స్ ని కలిసి స్టోరీ చెప్పాడట. లారెన్స్ కు కథ నచ్చిందని.. వెంటనే నిర్మాత రాజేష్ దండ అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. లారెన్స్ లీడ్ రోల్ లో కిశోర్ సినిమా రాబోతుంది. శర్వానంద్ తో శ్రీకారం సినిమా చేసిన కిశోర్ ఆ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఇప్పుడు ఏకంగా లారెన్స్ కోసం స్టోరీ సిద్ధం చేశాడు. లారెన్స్ కూడా చాలా కాలంగా తెలుగు స్ట్రైట్ సినిమా చేయాలని అనుకుంటున్నా కుదరట్లేదు. ఫైనల్ గా ఇన్నాళ్లకు ఆ ఆఫర్ వచ్చింది. రాజేష్ దండ శ్రీకర బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో అల్లరి నరేష్ బచ్చల మల్లి తెరకెక్కుతుంది. లారెన్స్ కి కథ నచ్చింది అంటే ఈసారి కిశోర్ పకడ్బందీ ప్లానింగ్ తోనే వస్తున్నట్టు తెలుస్తుంది. లారెన్స్ కి తెలుగులో సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. కష్టపడి పైకొచ్చిన లారెన్స్ ఎలాంటి వారినైనా సరే ఆప్యాయంగా పలకరిస్తాడు. అంతేకాదు అపాదలో ఉన్న ఫ్యాన్స్ ఎవరికైనా ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా సాయం చేస్తుంటాడు. అందుకే లారెన్స్ ను తెలుగు ఆడియన్స్ కూడా ఇష్టపడుతుంటారు. ఆయన సినిమాలు ఆదరిస్తూ ఆయన బాగుండేలా చేస్తే ఆయన ద్వారా మరో పది మంది బాగుండేలా చూసుకుంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: