తనను మోసం చేసిన వాళ్ల గురించి స్పందించిన సుమన్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ నటులలో సుమన్ ఒకరు. ఈయన ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయికి వెళ్లే రేంజ్ లో కెరియర్ ను కొనసాగించాడు. ఇక ఆ తర్వాత ఈయన నటించిన చాలా సినిమాలు వరుసగా అపజయాలు అందుకోవడం వల్ల ఈయన కెరియర్ గ్రాఫ్ భారీగా పడిపోతూ వచ్చింది. ఇక ఈయన తెలుగు తో పాటు అనేక తమిళ సినిమాలలో కూడా నటించాడు.

తమిళ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సుమన్ సంపాదించుకున్నాడు. కెరియర్ తోలి నాళ్లలో హీరోగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన హీరో గా కెరియర్ గ్రాఫ్ భారీగా పడిపోవడంతో ఆ తర్వాత సినిమాల్లో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలో నటించడం మాత్రమే కాకుండా విలన్ పాత్రల్లో కూడా నటించాడు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన శివాజీ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే ఈ సినిమాలోని సుమన్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంశలు కూడా లభించాయి.

ఇకపోతే తాజాగా సుమన్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సుమన్ మాట్లాడుతూ ... మొదటి నుండి కూడా నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అందుకే నన్ను మోసం చేసిన వాళ్లను కూడా నేనేమీ అనలేదు. నన్ను మోసం చేసిన వాళ్లలో కొంత మంది ఇప్పుడు లేరు. ఉన్న వాళ్ల కుటుంబాలు కూడా ప్రస్తుతం ఎవరు సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లను నేను మనసులో కూడా ఎప్పుడూ తిట్టుకోలేదు. కర్మను ఎవరు కూడా అస్సలు తప్పించుకోలేరు. వాళ్లను అలా చూడటానికి నాకు బాధగానే అనిపిస్తూ ఉంటుంది అని సుమన్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: