"పక్కా కమర్షియల్" కి ఆ పొరపాటు చేశాను.. అందుకే రిజల్ట్ తేడా కొట్టింది... మారుతి..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో మారుతి ఒకరు. ఈయన ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమాను ఈ దర్శకుడు అత్యంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఇక ఈ మూవీ విడుదలకి ముందు పెద్దగా ప్రచారం లేకుండా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యాక ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు రావడంతో ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు వచ్చాయి. దానితో ఈ సినిమా తక్కువ బడ్జెట్ తోనే రూపొందడంతో ఈ మూవీ ద్వారా నిర్మాతలకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి.

అలాగే మారుతీ కి ఈ సినిమా ద్వారా సూపర్ క్రేజ్ లభించింది. కొంత కాలం క్రితం ఈ దర్శకుడు నాని హీరో గా రూపొందిన భలే భలే మగాడివోయ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో మారుతీ ఈమేజ్ ఒక్క సారిగా తెలుగు లో భారీగా పెరిగిపోయింది. ఇకపోతే తాజాగా మారుతి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు. తాజాగా మారుతి మాట్లాడుతూ ... సినిమాకు ఫుల్ స్టోరీ అనేది చాలా ముఖ్యం.

కొన్ని సందర్భాలలో మనం ఫస్టాఫ్ కు సంబంధించిన కథ రెడీ అయ్యింది కదా అని సినిమాను మొదలు పెడితే ఆ తర్వాత సెకండాఫ్ విషయంలో చాలా తడబడాల్సి వస్తుంది. దాని వల్ల సినిమా రిజల్ట్ తేడా కొట్టే అవకాశం ఉంటుంది. ఇక పక్క కమర్షియల్ మూవీ విషయంలో కూడా అదే జరిగింది. ఆ సినిమాకు ఫస్ట్ అఫ్ సూపర్ గా ఉంది కదా అని మొదలు పెట్టాం. ఆ తర్వాత సెకండాఫ్ అనుకున్నట్లుగా రాలేదు. అందుకే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే పక్కా కమర్షియల్ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటించగా ... రావు రమేష్ విలన్ పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: