రాజ్ తరుణ్ కేసులో తవ్వే కొద్ది బయటపడుతున్న నిజాలు.. దానికోసం అన్ని లక్షలు ఇచ్చా.. లావణ్య..!?

Anilkumar
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు వ్యవహారంలో తవ్వుతున్న  కొద్ది సంచలన నిజాలు బయటకి వస్తున్నాయి. రాజ్ తరుణ్ తో తనకి దాదాపుగా పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది అని.. పెళ్లి తర్వాత రాజ్ తరుణ్ స్వయంగా తనకి అబార్షన్ సైతం చేయించాడు అని.. పదేళ్ల నుండి తామిద్దరం కలిసి ఉంటున్నామని.. ఓకే ఇంట్లో కాపురం చేస్తున్నాము అని పేర్కొంది రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య. వాటికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ సైతం తాజాగా పోలీసులకు అందించాను అని వెల్లడించింది. అయితే తాజాగా వీళ్ళిద్దరి వ్యవహారంలో మరో సంచలన నిజం బయటపడింది. అదేంటంటే ఈ కేసులో ముగ్గురిపై ఐపిసి 420,

 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. నార్సింగ్ పోలీసులు ఏ1 గా రాజ్ తరుణ్ ఎ.2గా మాల్వి మల్హోత్రా a3 గా మయాంక్ మల్హోత్రను పేర్కొన్నారు. అయితే 2008 నుండి వీళ్ళిద్దరి మధ్య ఈ వ్యవహారం జరుగుతుంది అని.. 2010లో లావణ్య కు రాజ్ తరుణ్ తన ప్రేమ విషయాన్ని చెప్పాడు అని.. ఆ తర్వాత 2014లో వాళ్ళిద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు అని.. కానీ ఈ విషయం తన ఇద్దరికీ తప్ప ఎవరికి తెలియదు అని పేర్కొంది లావణ్య. అయితే తాజాగా మరో సంచలన విషయాన్ని బయట పెట్టింది. అదేంటంటే రాజ్ తరుణ్ కి తాను 70 లక్షలు ఇచ్చాము అని.. 2016లో రాజ్ తరుణ్ వల్ల తల్లి అయ్యాను

 అని.. రెండు నెలల్లో అబార్షన్ చేయించాడు అని పేర్కొంది. అంతేకాదు అబార్షన్ చేయించడానికి ఆసుపత్రి బిల్లు కూడా తానే చెల్లించాడు అని చెప్పింది. అంతేకాదు రాజ్ తరుణ్ మాల్వి ఇద్దరూ కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించారు అని.. దీనిపై రాజ్ తరుణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని పేర్కొంది. అలాగే మాల్వి ఆమె సోదరుడు ఇద్దరు కలిసి నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు అంటూ పేర్కొంది. కేవలం మాల్వి పైనే కాకుండా తన సోదరుడు మయాంక్ పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని వాపోయింది. అయితే వీళ్ళిద్దరి వ్యవహారం బయటపడి చాలా రోజులు అవుతున్నప్పటికీ రోజుకొక ట్విస్ట్ బయటపడుతుంది. మరి ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: