ఆ డైరెక్టర్ వదిలేసిన నటుడ్ని పట్టేసుకున్న రాజమౌళి.. ఇదే సూపర్ ఛాన్స్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సురేందర్ రెడ్డి ఒకరు. ఈయన కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అతని ఒక్కడే మూవీ  తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. దాని తర్వాత ఈయనకు వరుసగా తెలుగు లో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుడు స్థాయికి సురేందర్ రెడ్డి వెళ్లిపోయాడు.

ఇకపోతే ఆఖరుగా ఈ దర్శకుడు అఖిల్ హీరో గా రూపొందిన ఏజెంట్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అపజయం అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి , పవన్ కళ్యాణ్ హీరో గా ఓ మూవీ చేయాలి అనుకున్నాడు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనలు ఏవి ఈ మధ్యలో రావడం లేదు. ఇక ఆ తర్వాత ఈయన తమిళ నటుడు అయినటువంటి విక్రం హీరోగా ఓ మూవీ ని చేయాలి అనుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్ళలేదు.

ఇక సురేందర్ రెడ్డి చేతము అనుకొని వీలుకాని విక్రమ్ తో రాజమౌళి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్ర కోసం రాజమౌళి , విక్రమ్ తీసుకోవాలి అని ఆలోచనలో ఉన్నట్లు , అందులో భాగంగా ఈయనతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో కనుక విక్రమ్ భాగం అయినట్లు అయితే ఈ మూవీ పై అంచనాలు మరింతగా పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: