"మిస్టర్ బచ్చన్" ఆ తేదీన విడుదల చేయనున్నారా.. అలా అయితే ఆ యువ నటుడికి కష్టమే..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా కనిపించబోతోంది. జగపతి బాబు ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించలేదు.

కానీ ఈ మూవీ విడుదల గురించి ఓ తేదీని బృందం లాక్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం ఈ సినిమాని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు మరికొన్ని రోజుల్లో ఈ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే చాలా రోజుల క్రితమే ఆగస్టు 15 వ తేదీన పుష్ప పార్ట్ 2 మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ తేదీకి దగ్గరగా ఎవరు రాలేదు.

కానీ ఎప్పుడూ అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే డిసెంబర్ 6 వ తేదీకి వెళ్లడంతో ఆ తేదీ పై అనేక మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ రెండు మూవీ లపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల అయితే వీటికి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ప్రాబ్లం ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: