బిగ్ బాస్ తో ఒరిగిందేమీ లేదు.. కావాలనే బయటకు పంపారు : షకీలా

praveen
తెలుగు బుల్లితెరపై ఎన్ని షోస్ ఉన్న ఇక బిగ్గెస్ట్ రియాలిటీ షో అనే పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ కి మాత్రం ఎప్పుడు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు బిగ్ బాస్ షోలో భాగంగా హౌస్ లోకి వెళ్లి వంద రోజులు ఉండడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకరకంగా ఈ ప్రపంచానికి దూరంగా బ్రతకడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే అందరికీ తెలిసిన సెలబ్రిటీల గురించి తెలియని విషయాలు తెలుసుకునేందుకు ఇక ఈ షో చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ప్రేక్షకులు.

 కాగా ఇప్పటివరకు తెలుగు బుల్లితెరపై  బిగ్ బాస్ ఏడు సీజన్లు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి బయటికి వచ్చిన సమయంలో కంటెస్టెంట్లుగా వెళ్లినవారు.. ఆ షో గురించి ఏం మాట్లాడినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే బిగ్బాస్ తెలుగు ఏడవ సీజన్లో హౌస్ లోకి వెళ్లిన వారిలో షకీలా ఒకరు. ఆమె రెండోవారమే ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

 బిగ్ బాస్ హౌస్ లో ఆట సందీప్, అమరుదీప్, ప్రియాంక, దామిని నిజాయితీగా అనిపించారు. వాళ్ళ కళ్ళలో ఫేక్ నెస్ నాకు కనిపించలేదు. ఇక శివాజీ న్యూట్రల్ గా ఉండేవాడు. అతను మంచోడో చెడ్డోడో తెలియదు. వెనకబడిన కంటెస్టెంట్స్ కి మాత్రం సపోర్ట్ ఇచ్చేవాడు. పల్లవి ప్రశాంతి నాకు అసలు నచ్చలేదు. అతని ఫాన్స్ నన్ను ఏం చేసినా నేను లెక్క చేయను. మొదట్లో పిళ్లిలా ఉండేవాడు. రాను రాను ఆటిట్యూడ్ మార్చేసాడు. పెద్దవాళ్ళు అంటే గౌరవం ఉండేది కాదు. ఆర్టిస్ట్ ముందే కాళ్ళ మీద కాలేసుకుని కూర్చునేవాడు. వినయంగా నటించి తర్వాత యాటిట్యూట్ చూపించాడు. అతని ప్రవర్తన నాకు నచ్చలేదు. కేవలం పబ్లిసిటీ కోసం  మాత్రమే నన్ను హౌస్ లోకి తీసుకుని అవసరం అయిపోయాక ఎలిమినేట్ చేసి పంపేశారు. నాకు బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమీ లేదు. పేమెంట్ ఇచ్చారు. అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాను బిగ్ బాస్ వల్ల ప్రయోజనం ఒక నాగార్జునకే. ఎందుకంటే ఆయన అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్ ఉంటుంది. అలాగే ఆయన హోస్ట్ గా చేస్తున్నారు అంటూ షకీలా చేసిన కామెంట్స్ సంచలనంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: