పవన్ ఆ టైమ్ కు వచ్చి కథ చెప్పమన్నాడు.. నేను షాక్.. పూరి జగన్నాథ్..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన దర్శకుడుగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈ దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీ రోగా రూపొందిన బద్రి అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు మొదటి మూవీ తోనే తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో భాగంగా బద్రి సినిమా అవకాశం ఎలా వచ్చింది ..? ఆ సినిమా కథ పవన్ కళ్యాణ్ ఏ సమయానికి వచ్చి చెప్పమన్నాడు ఇలా అనేక విషయాలను వివరించాడు. తాజాగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ... నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి అని చాలా రోజులు ప్రయత్నిస్తున్నాను అలాంటి సమయంలో ఒక రోజు పవన్ మేనేజర్ నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ చేసి పవన్ గారు రేపు మీరు చెప్పే కథ వింటాను అన్నారు పొద్దున నాలుగు గంటలకు వచ్చి కథ చెప్పండి అని అన్నాడు. వెంటనే నేను షాక్. అంత పొద్దున కథ ఎవరు  వింటారు అని నేను అన్నాను. సార్ ఉదయాన్నే లేస్తారు... మీరు వచ్చి కథ చెప్పండి అన్నారు.

వెంటనే నేను పొద్దున్న మూడు గంటలకు లేచాను. నాకు పొద్దున లేవడం అస్సలు అలవాటు లేదు. కానీ లేచాను. రెడీ అయ్యాను. సార్ చెప్పిన టైమ్ కంటే కొంత ముందే ఆయన ఇంటి ముందు ఉన్నాను. లోపలికి పిలిచారు. రూమ్ లో కూర్చున్నాను. నేను మీకు అర్థగంట సమయం ఇస్తున్నాను. అంతలోపు కథ చెప్పి వెళ్ళండి అని అన్నాడు. అంతలోపు నేను చెప్పలేను సార్. నేను నేను కథ చెబుతూ వెళతాను అర్థ గంటలో ఒక సీన్ కానివ్వండి , ఎంత కథ అయినా కానివ్వండి మీకు నచ్చితే వినండి .. లేకపోతే డోర్ తీయండి వెళ్లిపోతాను అని చెప్పాను. ఇక పవన్ అలాగే నాలుగు గంటల పాటు కథ వింటూ ఉన్నట్లు పూరి జగన్నాథ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: