ఆ స్టార్ కథ రచయితకు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన వెంకీ.. వింటేజ్ వెంకీ బయటకు రానున్నాడా..?

MADDIBOINA AJAY KUMAR
విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన సైంధవ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను కూడా గతంలో దర్శకత్వం వహించిన హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ రెండు మూవీలు కూడా మంచి విజయాలను సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీనితో వెంకీ కి మరో అపజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. వెంకటేష్ తన తదుపరి మూవీ ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రేపు ఉదయం జరగబోతున్నాయి. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అని మూవీ బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా తర్వాత వెంకీ తన తదుపరి మూవీ కి కూడా ఆల్మోస్ట్ లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పోయిన సంవత్సరం శ్రీ విష్ణు హీరోగా సామజవరగమన అనే మూవీ రూపొంది బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి నందు రైటర్ గా పని చేశాడు. తాజాగా ఈ కథ రచయిత వెంకటేష్ ను కలిసి ఒక కథను వినిపించినట్లు , ఆ కథ సూపర్ గా ఉండడంతో వెంటనే వెంకి ఈ కథ రచయిత దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: