అఖిల్ తో అత్యంత రిస్క్ చేయనున్న యూవి క్రియేషన్స్.. తేడా కొడితే ఇక అంతే..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన కుటుంబలలో అక్కినేని కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుండి మొదటగా అక్కినేని నాగేశ్వరరావు సినీ పరిశ్రమలోకి వచ్చారు. ఈయన తన నటనతో , డిసిప్లేన్ తో తెలుగు పరిశ్రమలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్లారు. ఆ తర్వాత నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇక ఈయన కూడా ఎన్నో విజయాలను అందుకొని తెలుగు లో స్టార్ హీరో స్థాయికి వెళ్ళాడు. ఈయన వారసులుగా అక్కినేని నాగ చైతన్య మొదటగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యాడు.

ఆ తర్వాత నాగార్జున వారసుడిగా అఖిల్ ఇండస్ట్రీ లోకి వచ్చాడు. ఇక అఖిల్ ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ మినహాయిస్తే ఈయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా ద్వారా కూడా మంచి విజయం దక్కలేదు. ఈయన తన తదుపరి మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్లో చేయబోతున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కిన పలు సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్ కుమార్ , అఖిల్ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించాలి అనే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు అఖిల్ కెరియర్ లో ఏ సినిమాకు కూడా ఖర్చు చేయని మొత్తాన్ని ఈ సినిమాకు ఖర్చు చేయబోతున్నట్లు , అలాగే ఈ మూవీ ని ఏకంగా రెండు భాగాలుగా రూపొందించాలి అని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు అఖిల్ ఏ సినిమాకు కూడా భారీ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. భారీ స్థాయిలో లాభాలు రాలేదు. అయినప్పటికీ యూవి క్రియేషన్స్ బ్యానర్ వారు మాత్రం అఖిల్ తో ఒక అత్యంత భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా హిట్ టాక్ ను తెచ్చుకొని లాభాలను తెచ్చుకుంటే ఓకే కానీ ఏమైనా తేడా కొడితే మాత్రం ఇలాంటి ప్రాజెక్టుతో భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: