హిట్ కోసం మరోసారి అదే రూట్లోకి వెంకి.. ఈసారి వర్కౌట్ అయ్యేనా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన తన కెరియర్ లో ఎక్కువ శాతం పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలలో కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలలో నటించి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను అభిమానులుగా చేసుకున్నాడు. ఇకపోతే వెంకటేష్ కి ఈ మధ్య కాలంలో సరైన విజయం దక్కలేదు. కొంత కాలం క్రితం వెంకటేష్ హీరోగా రూపొందిన దృశ్యం 2 , నారప్ప సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యాయి.

ఇక చాలా కాలం తర్వాత వెంకటేష్ హీరోగా రూపొందిన సైంధవ్ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ఇకపోతే వెంకటేష్ తన తదుపరి మూవీని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క షూటింగ్ను ప్రారంభించి ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అని ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ హిట్ కోసం వెంకటేష్ తన ఓల్డ్ ఫార్ములాను ఫాలో కానున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ గతంలో మహేష్ బాబుతో కలిసి మల్టీస్టారర్ మూవీ లో హీరోగా నటించిన మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇక అనిల్ ప్రస్తుతం తయారు చేస్తున్న కథలో ఒక పవర్ఫుల్ పాత్ర ఉందట, అందులో బాలకృష్ణను తీసుకోవాలి అనే ఆలోచనలో అనిల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ బాలయ్య ఈ సినిమాలో నటించినట్లు అయితే ఇది తెలుగులో సీనియర్ స్టార్ హీరోలు నటించబోయే భారీ మల్టీ స్టార్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఇద్దరు హీరోలు ఈ మూవీలో కలిసి నటించినట్లు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. దానితో వెంకటేష్ కూడా అనిల్ ఆలోచనకు సై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: