ఆ సినిమా ఘనవిజయం సాధించడానికి కారణం ఇదే.. నాగార్జున కామెంట్స్..!

lakhmi saranya
కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తాజాగా నాగార్జున సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఈయన సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీస్ లో నేనున్నాను కూడా ఒకటి. నాగార్జున, శ్రేయ అండ్ ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి ఆదిత్య దర్శకత్వం వహించారు.
2004లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో క్లాసికల్ హిట్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి కారణం సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటూ తాజాగా నాగార్జున కామెంట్స్ చేశాడు. నా ఉచ్ఛ్వాసం కావనం.. అనే కార్యక్రమానికి అతిథిగా హాజరైన నాగార్జున దివంగత సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూ.." కేవలం రెండు లైన్లలోనే పాటలోని భావమంతా అర్థమయ్యేలా రాయడం ఆయన గొప్పతనం. ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా.. హనీ సాంగ్ ప్రతి కుటుంబానికి కరెక్ట్ గా సరిపోతుంది. ఒక తండ్రి తన కుమారుడికి చెప్పాలనుకున్న మాటలన్నీ ఆయన పాటల రూపంలో చెప్పారు.
ఇక నేనున్నాను సినిమా అంత హిట్ అవ్వడానికి కారణం ఏ శ్వాసలో చేరితే.. అనే సాంగ్. సినిమాను ఒక అద్భుతమైన మలుపు తిప్పే విధంగా సరైన సమయంలో ఆ పాట వస్తుంది. ఆ పాట రాసిన శాస్త్రీ లిరిక్స్ మరో స్థాయి లో ఉన్నాయి " అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ప్రజెంట్ నాగార్జున వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవలే నా సామి రంగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాగార్జున మంచి విజయం దక్కించుకున్నాడు. దీంతో తన తదుపరిచిత్రం పై మంచి హైప్స్ ఏర్పడ్డాయి. ఇక ప్రస్తుతం నాగార్జున ధనుష్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: