"అఖండ 2" కథలో మార్పులు... ఎందుకో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొంత కాలం క్రితం అఖండ అనే సినిమా రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న వెంటనే ఈ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే బోయపాటి శ్రీను ఇప్పటికే అఖండ 2 సినిమాకు సంబంధించిన స్టోరీ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతం బాలకృష్ణ రాజకీయ పనులతో బిజీగా ఉన్నారు.

ఆయన ఆ పనులు ఆ పనులు ముగించుకొని ఫ్రీ కాగానే అఖండ 2 సినిమాను ప్రారంభిస్తాం అని ప్రకటించారు. చెప్పినట్లుగానే కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణ , బోయపాటి కాంబోలో నాలుగవ మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే బోయపాటి ఈ శ్రీను "అఖండ 2" సంబంధించిన కథ మొత్తం పూర్తి అయ్యింది అని చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఇక మళ్లీ బోయపాటి ఈ సినిమాకు సంబంధించిన కథలో కొన్ని మార్పులు , చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఓకే అయినా స్టోరీలో మళ్ళీ మార్పులు, చేర్పులు ఎందుకు అనుకుంటున్నారా. గతంలో అఖండ సినిమా వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ అధికారంలో ఉంది. దానితో ఆ పార్టీకి కొన్ని చురకలు పెట్టేలా సన్నివేశాలను బోయపాటి చిత్రీకరించారు. ఇక ఈ కథ రాసేటప్పుడు కూడా వైసిపి పార్టీని అధికారంలో ఉంది. దానితో ఈయన మళ్ళీ వైసిపి పార్టీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు రాశాడట. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో అందుకు సంబంధించిన సన్నివేశాలలో వేరే సీన్స్ రాస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: