టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన లేటెస్ట్ కామెడీ బ్లాక్ బాస్టర్... అక్కడ ఓకే... ఇక్కడే డౌట్..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు శ్రీ విష్ణు తాజాగా ఓం భీం బుష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలల్ నటించారు. మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించి డీసెంట్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా థియేటర్లలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ కి ఓ టి టి ప్లాట్ ఫామ్ లో కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇలా ఇప్పటికే థియేటర్ , ఓ టి టి ప్రేక్షకులను అలరించడంలో సూపర్ గా సక్సెస్ అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది . ఈ సినిమా యొక్క సాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి స్టార్ మా సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సినిమాను వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. మరి థియేటర్ ఓ టి టి ప్రేక్షకులను అలరించడంలో బాగానే సక్సెస్ అయిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ , అయేషా ఖాన్ , శ్రీకాంత్ , మనీష్ కుమార్ మరియు రచ్చ రవి లు ముఖ్యమైన పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv

సంబంధిత వార్తలు: