ప్రభాస్ ఆ మాత్రం మాట్లాడడమే గొప్ప.. దీపిక పదుకొనే కామెంట్స్..!

lakhmi saranya
సినీ ప్రేక్షకులు అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నా సినిమా కల్కి. భారత పురాణాల స్ఫూర్తితో ఈ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే అండ్ దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు. గ్లోబల్ రేంజ్ లో అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రం వస్తుంది. కల్కి సినిమా మరో వారంలో అనగా జూన్ 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు అనగా జూన్ 19 ముంబైలో జరిగింది.
కల్కి ప్రి రిలీజ్ ఈవెంట్ కు ఈ మూవీలో నటించిన హీరో ప్రభాస్ అండ్ బాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే అండ్ నిర్మాత అశ్వినీ దత్ హాజరయ్యారు. దీపిక ప్రస్తుతం గర్భిణిగా ఉన్నప్పటికీ ఈవెంట్ కు హాజరైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ఈవెంట్లో కనిపించలేదు. ఇక ఈవెంట్ కు హోస్ట్ గా దగ్గుపాటి రానా వ్యవహరించారు. అమితాబచ్చన్ అండ్ కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించడం గురించి చెప్పాలని ప్రభాస్ను రానా అడిగారు.
దీంతో తను ప్రభాస్ కాళ్లు మొక్కుతానంటూ టీజ్ చేశారు అమితాబచ్చన్.  ఆ తర్వాత ప్రభాస్ అసలు విషయం చెప్పారు. తను అమితాబచ్చన్ కు పెద్ద అభిమాని అని తెలియజేశారు. ఆ వెంటనే దీపిక పదుకొనే గురించి చెప్పకుండానే మైక్ పక్కన పెట్టబోయారు ప్రభాస్. దీంతో పక్కనే ఉన్న దీపికా పదుకొనే గురించి చెప్పాలని గుర్తు చేశారు రానా. దీంతో సారీ అంటూ ప్రభాస్ మాట్లాడుతుండగా.. దీపిక కలిగించుకుంది. " ప్రభాస్ ఈ మాటలు మాట్లాడడమే ఎక్కువ. ఇంకా నా గురించి ఏం మాట్లాడతారు. ప్రభాస్కి మొహమాటం ఎక్కువ "  అంటూ కామెంట్స్ చేసింది దీపికా పదుకొనే. ప్రజెంట్ దీపికా పదుకొనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: