టీడీపీలోకి విజయసాయిరెడ్డి..భారీ ఆఫర్ ఇదే ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ దారుణంగా తయారవుతోంది. ఆ పార్టీలో ఉన్న కీలక లీడర్లు అందరు బయటకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆదుకోవడం లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవులను అనుభవించడం కీలక నేతలందరూ... కూడగట్టుకుని అధికార పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పటికే చాలామంది వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరి కొంతమంది రాజీనామా చేసే యువతలలో ఉన్నారు.
ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వైసిపి పార్టీలో... నెంబర్ 2  నాయకుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీలో విజయసాయిరెడ్డి చాలా కీలకమైన నేత. ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. త్వరలోనే ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియనుంది.
అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం..వైసీపీ నేతలపై కూటమి సర్కార్ కేసులు పెట్టడం జరుగుతోంది.  వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కూతురు..చుట్టూ వివాదం నెలకొంది.భీమిలి బీచ్ దగ్గర ఈ..రచ్చ కొనసాగుతోంది. అయితే ఈ వివాదాల నేపథ్యంలో నేరుగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.దీనికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ మాజీ ఏపీ అధ్యక్షులు అచ్చం నాయుడు..కూడా స్పందించారు.
 రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి... తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని కూడా అచ్చం నాయుడు బాంబు పేల్చారు. అయితే టిడిపిలోకి రావాలంటే కొన్ని కండిషన్స్ కూడా పెట్టాడట విజయ సాయి రెడ్డి.మళ్లీ తనకు రాజ్యసభ టికెట్ రావాలని.. కోరాడట.అయితే దీనిపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.తెలుగుదేశం పార్టీ నేతలు కావాలనే విజయ సాయి రెడ్డి పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు.దీనిపై విజయ సాయిరెడ్డి (  vijayasai reddy )  ఇంకా స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: