కల్కి కోసం విచ్చేస్తున్న ముఖ్య అతిధులు వీరే?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా 'కల్కి 2898AD' . వైజయంతీ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.హాలీవుడ్ సినిమాలని తలపించేలా 'కల్కి 2898 ఏడీ' సినిమా ఉండబోతున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌ చూస్తే పూర్తిగా అర్థం అవుతోంది. ఈ మూవీని దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా గ్రాండ్‌గా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఒకెత్తయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సినిమాకి మరో ఎత్తు అనే చెప్పాలి. ఈ ట్రైలర్ హాలీవుడ్ మార్వెల్ మూవీస్ రేంజ్‌లో ఉంటూ సినీ ప్రేక్షకుల్ని ఇంకా రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేగాక ఈ ట్రైలర్‌లో ప్రభాస్ లుక్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ప్రభాస్ అచ్చం మార్వెల్ హీరోలా సేఫ్టీ సూట్ ధరించి అదిరిపోయాడు. ప్రభాస్ లుక్‌కి ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు.


దీంతో ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకాభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ మూవీ ఈ నెల అంటే జూన్ 27న చాలా గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే స్టార్ హీరోలతో రెబల్ స్టార్ ప్రభాస్ 'బుజ్జి' కారును డ్రైవ్ చేయిస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మొత్తం మూడు ఈవెంట్‌లుగా నిర్వహించాలని కల్కి టీం ప్లాన్ చేస్తోందట. అందులో ఒక ఈవెంట్‌ను జూన్ 23 వ తేదీన ఏపీలోని అమరావతిలో నిర్వహించబోతుందని సమాచారం.ఇక ఆ తర్వాత చెన్నై, తర్వాత డిల్లీలో ఈవెంట్‌లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా అలాగే మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: