"నిప్పురవ్వ" తర్వాత బాలకృష్ణతో అందుకే సినిమా చేయలేదు... విజయశాంతి..!

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగించిన చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లతో ఎన్నో సినిమాలలో నటించింది. ఆ కాలంలో ఈమె తన నటనతో మాత్రమే కాకుండా , గ్లామర్ తో కూడా ప్రేక్షకులను కట్టిపడేసి చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగించింది.

ఇకపోతే ఈమె తన కెరియర్ లో బాలకృష్ణ తో అనేక సినిమాలలో నటించింది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరోగా విజయశాంతి హీరోయిన్ గా నిప్పు రవ్వ అనే మూవీ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె మాట్లాడుతూ నిప్పురవ్వ మూవీ తర్వాత బాలకృష్ణ తో సినిమా చేయకపోవడానికి గల కారణాలను వివరించింది.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా విజయశాంతి మాట్లాడుతూ ... బాలకృష్ణ గారు నాకు మంచి స్నేహితుడు. ఆయన , నేను కలిసి ఎన్నో సినిమాలలో నటించాం. మా కాంబోలో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీస్ వచ్చాయి. కాకపోతే నిప్పు రవ్వ సినిమా తర్వాత మేము కలిసి సినిమా చేయలేదు. దానికి ప్రధాన కారణం నాకు ఆ సినిమా తర్వాత చాలా క్రేజ్ వచ్చింది. దాదాపు ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలోనే నటించడానికి ప్రాముఖ్యతను ఇచ్చాను. నేను హీరోల స్థాయిలో రెమ్యూనిరేషన్ కూడా తీసుకున్నాను. ఇక అలాంటి సమయంలో నాకు కమర్షియల్ సినిమాలలో నటించాలి అనే ఉద్దేశం లేదు. అందుకే నేను నిప్పు రవ్వ సినిమా తర్వాత బాలకృష్ణ తో సినిమా చేయలేదు అని విజయశాంతి క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: