రఘువరన్ తనయుడు రిషి వరన్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

praveen
నటుడు రఘువరన్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి కూడా విలనిజమే గుర్తుకు వస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే రఘువరన్ కెరియర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించారు. విలన్ గా మాత్రమే కాకుండా హీరో హీరోయిన్ల తండ్రి పాత్రల్లో కూడా కనిపించారు. కానీ ఎందుకో ఆయన విలనిజానికే అభిమానులు ఎక్కువగా కనెక్ట్ అయిపోయారు. ఒకరకం గా విలడనిజం పండించడంలో కూడా కొత్త ట్రెండ్ సృష్టించాడు రఘువరన్. ఇక రఘువరన్ అనే పేరు విలన్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ అనే విధంగా ప్రేక్షకుల్లో భావన ఏర్పడింది.

 తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాదిలో కూడా స్టార్ గా వెలుగొందారు ఆయన. సినిమాల్లో నటించే సమయంలోనే నటి రోహిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా జన్మించారు. అతనికి రిశివరన్ అనే పేరు పెట్టారు. అయితే కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో రఘువరన్ రోహిణి 2004లో విడిపోయారు. ఇక చివరి రోజుల్లో ఆల్కహాల్ కు బానిసగా మారిపోయిన రఘువరన్ 2008 మార్చ్ 19వ తేదీన కన్నుమూశారు.

 అయితే ఈ మధ్యకాలం లో స్టార్ కిడ్స్ అందరూ కూడా ఇండస్ట్రీకి పరిచయమై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా ట్రెండీ విలన్ రఘువరన్ కుమారుడు రిషి వరుణ్ కూడా తండ్రి బాటలోనే దూసుకు వెళ్తున్నాడు. 26 ఏళ్ల ఈ స్టార్ కిడ్ నటుడిగా కాకుండా సంగీతంలో రాణిస్తున్నాడు. ఇలా తండ్రిలా నటన లో కాకుండా సంగీతంలో సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే కొన్ని ఇంగ్లీష్ ఆల్బమ్ లు కూడా రిలీజ్ చేశాడు. అయితే రఘువరన్ కి కూడా సంగీతం  పై ఎంతో ఆసక్తి ఉండేది  కానీ సినిమా అవకాశాలు పెరగడంతో బిజీ అయిపోయి తనలోని మ్యూజిక్ టాలెంట్ పై దృష్టి సారించ లేకపోయాడు. కానీ ఇప్పుడు తండ్రి కోరికను కొడుకు నెరవేరుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: