అలాంటి యాడ్స్ రిజెక్ట్ చేస్తూ కోట్లు వదులుకుంటున్న టాలీవుడ్ స్టార్స్..??
ఈ విషయంలో టాలీవుడ్ హీరోలను మెచ్చుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఏ ఒక్క తెలుగు హీరో కూడా పాన్ మసాలా, మద్యం వంటి ప్రజల ఆరోగ్యాని హాని కలిగించే ఉత్పత్తుల యాడ్స్ లో నటించలేదు. కోట్లాది రూపాయలు ఆఫర్ చేసిన కూడా ప్రజల ఆరోగ్యం కంటే డబ్బులు ముఖ్యం కాదు అన్నట్లు టాలీవుడ్ హీరోలు స్పందించారు. గతంలో ప్రభాస్, మహేశ్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోలకు ఇలాంటి యాడ్స్ చేయాలని ఆఫర్లు వచ్చాయి. కోట్లాది రూపాయలు ఇస్తామని కూడా ఆఫర్ చేసినా.. వారు అంగీకరించలేదు. అలానే ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మద్యం కంపెనీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందని టాక్. అయితే ఆ యాడ్ లో నటించేందుకు బన్నీ ఒప్పుకోలేదట. కేవలం 60 సెకన్లు మాత్రమే కనిపిస్తేచాలని కోరాయట.కానీ ఆ డీల్ ను బన్నీ చాలా సున్నీతంగా తిరష్కరించారట. ఇలా మొత్తంగా మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర దుర్వస్యనాల యాడ్స్ లలో నటిస్తే ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు, సమాజంలో చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని టాలీవుడ్ హీరోలు భావిస్తున్నారు. అందుకే ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తాము ప్రజలకు హానికరం చేసే వస్తువులను ప్రమోట్ చేయనట్లు తెలుగు హీరోలు ఉన్నారు. ఇలా కోట్లు వదులుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోలపై ప్రజలు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన హీరోయిజం అంటే ఇదే కదా అంటూ తెలుగు హీరోలపై ప్రశంస వర్షం కురిపిస్తున్నారు. మరి.. ఇలా కోట్లు వదులుకుని ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావిస్తున్న టాలీవుడ్ హీరోలపై మీ అభినందనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.