అందుకే అక్కడి నుండి వెనక్కు తిరిగి వచ్చిన రాజమౌళి... మహేష్..?

MADDIBOINA AJAY KUMAR
"ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ ను క్రేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి తన తదుపరి మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ మొత్తం పూర్తి అయింది. ఇక రాజమౌళి ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఫుల్ వేగవంతంగా పూర్తి చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈ సినిమా హీరో అయినటువంటి మహేష్ బాబు , దర్శకుడు రాజమౌళి , ఈ మూవీ ని నిర్మించబోతున్న కే ఎల్ నారాయణ ఈ సినిమా కథ చర్చల కోసం కొన్ని రోజుల క్రితమే దుబాయ్ కి వెళ్లారు.

ఇకపోతే దుబాయ్ లో విరు చాలా రోజులు ఉంటారు అని అంతా అనుకున్నారు. కానీ వీరు ఎక్కువ రోజులు అక్కడ ఉండకుండా చాలా తొందరగా వెనక్కి తిరిగి వచ్చేసారు. దానితో విరు ఎందుకు వెళ్లారు..? ఎందుకు వచ్చారు..? అనే ప్రశ్నలు జనాల్లో రేకెత్తాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దుబాయ్ లో ప్రస్తుతం భారీ వరదలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక అది తెలియక దుబాయ్ వరకు వెళ్లిన వీరు మళ్లీ అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో తిరిగి వెనక్కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే మహేష్ బాబు ఈ సినిమాకు సంబంధించిన వర్కౌట్ లను కూడా మొదలు పెట్టాడు.

అందులో భాగంగా పొడవాటి జుట్టును కూడా పెంచి కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ మూవీ మొదలు కాకముందే ఈ సినిమాపై కేవలం ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక రాజమౌళి కూడా ఈ సినిమాను అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ బాబు "గుంటూరు కారం" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ బిర్యాని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: