నెలసరి సమయంలో వాటి జోలికి వెళ్ళనంటున్న నటి...!!

murali krishna
గాయత్రి రెడ్డి ఈ పేరు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈమె మొదట బిగిల్ సినిమాలో ఫుట్బాల్ ప్లేయర్ గా నటించింది. ఆ తర్వాత లిస్ట్ అనే సినిమాలో కూడా నటించింది మెప్పించింది గాయత్రి రెడ్డి.ఆపై తెలుగులో షికారు మూవీలో సహాయక పాత్రలో మెరిసింది. 2022లో సివిల్‌ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యింది. తనకంటూ సొంతంగా ఒక యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ అప్పుడప్పుడూ వీడియోలు రిలీజ్‌ చేస్తూ ఉంటుంది.అందులో భాగంగానే తాజాగా ఆమె నేను సెల్ఫీస్ అంటూ ఒక వీడియోని విడుదల చేసింది. నేను నెలసరి సమయంలో కాఫీలు గట్రా తాగను.అవి తాగితే సమస్య ఎక్కువ అవుతుంది. పీరియడ్స్‌ ఉన్నప్పుడు పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. కాబట్టి నాలుగు రోజుల దాకా వాటి జోలికి వెళ్లను. మరీ ఏదైనా తాగాలి అనిపిస్తే లెమన్‌ టీ, అల్లం ఛాయ్‌ మాత్రమే తాగుతాను.
మీరు కూడా పీరియడ్స్‌ సమయం లో కాఫీ జోలి కి వెళ్లొద్దు. ఇకపోతే మా అమ్మ నేను సెల్ఫిష్‌ అని ఎప్పుడూ అంటూ ఉండేది. అది నిజం.  అది చెప్పడానికే ఈ వీడియో చేశాను. నాతో మంచిగా ఉండని స్నేహితులందరినీ కట్‌ చేశాను.ఎందుకంటే మా నాన్న తన డబ్బుతో కారు కొన్నా ఎవరూ నాకు విష్‌ చేయలేదు. ఇప్పటికీ వాళ్లు సెటిలైందే లేదు. అంతా టైం వేస్ట్‌ చేస్తున్నారు. నేనిప్పుడు ఆస్ట్రేలియాలో గొప్పగా జీవిస్తున్నాను.కానీ చాలామంది పదేళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. పైగా చాలామందితో ఎఫైర్స్‌ నడిపిస్తూ అదే మంచి జీవితం అన్న భ్రమ లో బతికేస్తున్నారు. అదే నాకు షాకింగ్‌ గా అనిపిస్తూ ఉంటుంది అని గాయత్రి రెడ్డి చెప్పుకొచ్చింది. ఈ సందర్బంగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: