సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?"

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఒకటి. సూర్య దేవర నాగ వంశీ ఈ సంస్థలో సినిమాలను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సంస్థ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి..? అవి ఏవి అనేది తెలుసుకుందాం.

విశ్వక్ సేన్ హీరో గా నేహా శెట్టి హీరోయిన్ గా ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ సంవత్సరం మే నెలలో విడుదల కానుంది. ప్రస్తుతం బాలకృష్ణ హీరో గా బాబీ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని కూడా ఈ బ్యానర్ వారే నిర్మిస్తున్నారు. 

దుల్కర్ సల్మాన్ హీరో గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను కూడా ఈ బ్యానర్ వారే నిర్మిస్తున్నారు. తాజాగా గౌతమ్ తిన్ననూరి "మ్యాజిక్" అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని కూడా సితార బ్యానర్ వారే నిర్మించారు. మరికొన్ని రోజుల్లో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కానుంది. దీనిని కూడా ఈ బ్యానర్ వారే నిర్మించనున్నారు. 

సాయి ధరమ్ తేజ్ హీరో గా ప్రస్తుతం గాంజా శంకర్ అనే మూవీ రూపొందుతుంది. ఈ సినిమాను కూడా ఈ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ తో పాటు రవితేజ హీరోవ్గా రుక్మిణి వసంత్ దర్శకత్వం లో రూపొందనున్న మూవీ ని , టిల్లు క్యూబ్ , మ్యాడ్ 2 మూవీ ని వీటితో పాటు అశోక్ గల్లా హీరో గా రూపొందనున్న ఓ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు రూపొందించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: