అద్దె కట్టలేక.. రోడ్డున పడ్డాం : రష్మిక

praveen
రష్మిక మందన్న.. ఈ హీరోయిన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి వరకు కేవలం కోలీవుడ్ టాలీవుడ్ లో మాత్రమే ఈ అమ్మడికి గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకొని కోట్లాదిమంది అభిమానులకు గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది ఈ హీరోయిన్. చలో అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఇక మొదటి సినిమానే హిట్ కావడంతో ఇక ఈ అమ్మడి కెరీర్ కు బాగా ప్లేస్ అయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో చేసిన గీతాగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అందరూ చూపు ఈ హీరోయిన్ వైపు మళ్ళింది.

  ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలు అందరికి సరసన కూడా ఛాన్సులు దక్కించుకుంటూ వస్తుంది. ఇక అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ కావడంతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటికే నేషనల్ క్రష్ గా గుర్తింపును సంపాదించుకున్న రష్మిక పుష్ప తర్వాత గ్లోబల్ హీరోయిన్ అనే ట్యాగ్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడూ పుష్ప 2,  సినిమాలో నటించడమే కాదు మరికొన్ని ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్.. తాను కూడా ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది.

 తన బాల్యంలో ఆర్థిక కష్టాల కారణంగా కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాను అంటూ రష్మిక మందన్న తెలిపింది. నా చిన్నప్పుడు సొంత ఇల్లు లేదు  ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇల్లు మారే వాళ్ళం. అద్దె కట్టలేక రోడ్డున పడ్డ సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అప్పటి పరిస్థితులను దృశ్య నా తల్లిదండ్రులు నాకు ఆడుకోవడానికి ఒక బొమ్మను కూడా కొనివ్వలేకపోయారు. అందుకే నేను డబ్బుకు విలువని ఇస్తాను. సక్సెస్ను అంత ఈజీగా తీసుకోను అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: