గోపీచంద్‌తో సినిమా చేయబోతున్న 'రాధేశ్యామ్ దర్శకుడు...??

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకరు. గోపీచంద్ చాలా రోజుల క్రితం విడుదల అయినటువంటి సిటీమార్ మూవీ తో పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు .ఆ తరువాత పక్క కమర్షియల్ ... రామబాణం సినిమాలతో వరస అపజాయలను ఎదుర్కొన్నాడు . అలా రెండు వరస అపజయాల తర్వాత తాజాగా గోపీచంద్ "బీమా" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందు కు వచ్చాడు. ఈ సినిమాతో అయిన గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటాడు అని ఆయన అభిమాను లు ... కొంత మంది ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా గోపీచంద్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందిం చలేక పోయింది. ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ , శ్రీను వైట్ల దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.
శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కూడా స్పీడ్ గా జరుగుతూ ఉండడం తో గోపీ చంద్ తన తదుపరి మూవీ పై కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీ చంద్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. భీమా మాతో సక్సెస్ ట్రాక్ అందుకున్నారు హీరో గోపిచంద్. మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా హర్ష దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే తన తర్వాతి సినిమాల విషయంలో సాహసం చేస్తున్నారు గోపిచంద్. రాధేశ్యామ్ వంటి భారీ డిజాస్టర్‌ సినిమాను ఇచ్చిన రాధాకృష్ణతో సినిమాకు ఓకే చెప్పేశారు. గతంలో గోపిచంద్‌తో జిల్ సినిమా చేశారు గోపిచంద్. 2015లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే తర్వాత తెరకెక్కిన రాధేశ్యామ్ భారీ డిజాస్టర్‌గా మిగిలింది.ఇప్పటికే ఈ మూవీ స్టోరీ లైన్‌ను గోపీచంద్‌కు వినిపించగా ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అఫిషియల్‌ ప్రకటన రావాల్సి ఉండగా ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: