నన్ను కలవాలంటే గంటకు రూ.5లక్షలు ఇవ్వాలి.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్?

praveen
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అందరికీ సుపరిచితుడుగా మారిన రామ్ గోపాల్ వర్మ శిష్యుడు ఈయన. అయితే వర్మ ఎలా వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గురువు ఆర్జీవిని మించి  అటు అనురాగ్ కశ్యప్ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో నిలుస్తూ ఇక వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు. అనురాగ కశ్యప్ చేసే సినిమాలు కూడా ఇలాగే ఉంటాయి అని చెప్పాలి.

 గతంలో కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాను చేసి అనురాగ్ కశ్యప్ ఏకంగా ఎన్నో వివాదాలకు కారణమయ్యారు. ఇక ఈ సినిమా ఎంత సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా జనాలను సైతం అవాక్కయ్యేలా  చేస్తూ ఉన్నాయి. తనను కలవాలంటే ఎవరైనా సరే డబ్బులు కట్టాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్. డబ్బులు ఇవ్వకుండా ఎవరిని కలవను అంటూ తెగేసి చెప్పేశాడు. డబ్బులు కట్టలేని వారు కనీసం తనకు కాల్స్, మెసేజెస్ కూడా చేయవద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ డైరెక్టర్.

 ఇటీవల ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇప్పటికే చాలా సమయం వృధా చేశాను. కొత్త వ్యక్తుల్ని కలవడానికి నా దగ్గర టైం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ తనను కలవాలంటే అరగంటకు రెండు లక్షలు గంటకి ఐదు లక్షలు ఇవ్వాల్సిందే అంటూ తెగేసి చెప్పాడు. అలా ఇవ్వలేని వారు తనకు కాల్స్ మెసేజెస్ చేయొద్దు అంటూ చెప్పాడు. షార్ట్ కట్స్ వెతుక్కునేవారు అంటే తనకు అస్సలు నచ్చదు అంటూ ఈ బాలీవుడ్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. మరి అంత డిమాండ్ ఏంటి.. కలవడానికి ఎవరైనా డబ్బులు తీసుకుంటారా అంటూ ఇక ఈ విషయంపై నేటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: