ఆకాశాన్నంటే ధరలతో దీపికా కొత్త బిజినెస్..!!

murali krishna
బాలీవుడ్ నటి దీపిక పదుకొనే ఓవైపు కొన్ని బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వ్యాపార ప్రకటనల్లో చేస్తూ బిజినెస్ లు కూడా చేస్తూ మరోవైపు సినిమాల్లో కూడా స్టార్ నటిగా కొనసాగుతోంది.ఇక ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు.అయితే అలాంటి దీపిక పదుకొనే ఇప్పటివరకు సినిమాలు,బిజినెస్ లద్వారా బాగానే ఆస్తులు కూడబెట్టిన్నట్టు తెలుస్తోంది.మరి ఇంతకీ బాలీవుడ్ నటి దీపిక పదుకొనే ఎన్నికోట్ల ఆస్తులు కూడబెట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. దీపిక పదుకొనే బాలీవుడ్ లోనే కాకుండా ప్రభాస్క ల్కి 2898 ఏడి మూవీ తో సౌత్ ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతుంది.ఇక ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీ నుండే సినిమాల్లోకి వచ్చింది. కానీ బాలీవుడ్లో పాగా వేసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఇక బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకుంది. ఇక వీరి పెళ్లయి దాదాపు 5 సంవత్సరాలు పూర్తవుతుంది.అయితే రీసెంట్ గానే ఈమె తల్లీ కాబోతున్నాను అంటూ ఒక గుడ్ న్యూస్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే.సినిమా నటులు వివిధ వ్యాపారాలు చేయడం సహజమే. తాజాగా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ కూడా ఓ హోమ్ ఫర్నీషింగ్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది.అయితే ఈ బిజినెస్ ను ఆమె నేరుగా కాకుండా అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ పాటరీ బార్న్ తో కలిసి చేస్తోంది. ఇందులో భాగంగా ఇంట్లోకి కావాల్సిన వివిధ వస్తువులను ఆ సంస్థ విక్రయిస్తోంది.అయితే దీపికా పదుకోన్ స్టార్ట్ చేసిన ఈ కొత్త ఫర్నీచర్ బిజినెస్ లో ధరలు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. లగ్జరీ ఇళ్లలోని సెలబ్రిటీలు మాత్రమే వీటిని కొనేలా రేట్లు ఉన్నాయి. వుడెన్ ఫర్నీచర్, డిన్నర్ వేర్ నుండి దిండ్లు, రగ్గుల వరకూ ఎన్నో వస్తువులు ఈ పాటరీ బార్న్ లో ఉన్నాయి. అయితే ఇందులో క్యాండిల్స్ సెట్ ధర రూ.3 వేలు కావడం విశేషం.
అతి తక్కువ ధర ఈ క్యాండిల్స్ దే. ఇక పర్షియన్ స్టైల్ రగ్గు ధర రూ.3.95 లక్షలుగా ఉంది. డైనింగ్ టేబుల్స్, పరుపులు, మంచాలు, కిచెన్ లో వాడే వస్తువులు, రగ్గులు, లైటింగ్స్ వంటి వన్నీ ఈ పాటరీ బార్న్ ఇండియా వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. తన కొత్త బిజినెస్ గురించి దీపికా స్పందించింది."ఇదేదో ఆశామాషీ భాగస్వామ్యం కాదు. చాలా బ్రాండ్లలాగా ఏవో పది వస్తువులను పంపించి ఇందులో ఏదో ఒకదానికి ఓకే చెప్పేయండి.. మీ పేరు పెట్టి అమ్మేస్తాం అనేలా కాదు. నేను ఇందులో ప్రతి దానిపై పని చేశాను. అది అంత సులువైన విషయం కాదు. ఆ సంస్థ కాలిఫోర్నియాలో ఉంది. నేను ఇండియాలో ఉన్నాను. ఇద్దరి మధ్య ఎన్నో విషయాలపై ఎంతో చర్చ జరిగింది. సుమారు రెండేళ్ల పాటు శ్రమిస్తే వీటికి ఒక తుదిరూపు వచ్చింది" అని దీపికా తెలిపింది. నిజానికి దీపికా పదుకోన్ పాటరీ బార్న్ కు డిసెంబర్, 2022లో బ్రాండ్ అంబాసిడర్ అయింది. కొన్ని నెలల తర్వాత దీనిని ఇండియాలోనూ లాంచ్ చేశారు.అలాగే ఈ జంట సెప్టెంబర్ లో తమ మొదటి బేబీకి జన్మనివ్వబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే దీపిక పదుకొనే తన సినిమాలతో,బిజినెస్ లతో ఇప్పటివరకు దాదాపు 550 కోట్ల ఆస్తులు సంపాదించినట్టు ఒక నివేదిక తెలుపుతోంది.ఇక తన భర్త రణవీర్ కపూర్ ఆస్తులు కాకుండానే కేవలం దీపిక పదుకొనే ఆస్తులే 550 కోట్లు ఉన్నాయట. ఇక ఈమెకు ముంబైలో ఫ్లాట్ తో పాటు కోట్ల ఖరీదు ఆస్తులు చాలానే ఉన్నాయట.అంతేకాకుండా లగ్జరీ కార్లు కూడా దీపికా పదుకొనే కార్ గ్యారేజీ లో ఉన్నాయి. అలా ఈమె బాలీవుడ్ లో ఉన్న రిచ్చెస్ట్ హీరోయిన్ లలో ఒకరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: