హిట్టు కోసం సౌత్ డైరెక్టర్ల వెంట పడుతున్న నార్త్ స్టార్స్?

Purushottham Vinay
బాలీవుడ్ హీరోలు ఒక  హిట్ కోసం సౌత్ డైరెక్టర్స్ పై ఆధారపడుతున్నారు. మొన్న షారుఖ్ ఖాన్ తమిళ దర్శకుడి అట్లీతో జతకట్టి.. 'జవాన్' మూవీతో వెయ్యికోట్ల హిట్టుని అందుకున్నారు. రణబీర్ కపూర్ కూడా హిట్టు కోసం తెలుగు యంగ్ డైరెక్టర్ సందీప్ వంగని నమ్ముకున్నాడు. సందీప్ తో చేసిన యానిమల్ మూవీ రణబీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఏకంగా 930 కోట్లు వసూలు చేసింది.అంతెందుకు అప్పుడెప్పుడో 2008 లో మురుగదాస్ డైరెక్షన్ లో గజినీ రీమేక్ చేసి అమీర్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాశాడు. అలాగే సౌత్ ఇండియా కొరియగ్రాఫర్ ప్రభుదేవా సల్మాన్ ఖాన్ కి పోకిరి రీమేక్ వాంటెడ్, అక్షయ్ కుమార్ కి విక్రమార్కుడు రీమేక్ రౌడీ రాతోర్ లాంటి హిట్లు ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ సల్మాన్ ఖాన్ ఒక సాలిడ్ హిట్టు కోసం తమిళ దర్శకుడితో జత కట్టబోతున్నాడు. 2017 తరువాత నుంచి సల్మాన్ ఖాన్ కి ఒక్క హిట్టు కూడా పడలేదు. టైగర్ 2 హిట్ సినిమా తరువాత మొన్న టైగర్ 3 వరకు ఇతనికి సరైన హిట్ పడలేదు.


బాలీవుడ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన టైగర్ 3లో షారుఖ్ ఖాన్ ఎంట్రీ కూడా.. ఆ మూవీకి మంచి విజయాన్ని అందించలేక పోయింది. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 500 కోట్ల మార్క్ ని కూడా అందుకోలేక బోల్తా పడింది. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అంతా.. షారుఖ్ లాంటి కమ్‌బ్యాక్ ని సల్మాన్ నుంచి కూడా కోరుకుంటున్నారు. సౌత్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ తో సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. మురగదాస్ ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి అక్కడి స్టార్స్ కి హిట్స్ అందించారు. సాజిద్ నడియాద్వాల ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 2025 రంజాన్ కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. కాగా మురగదాస్ ప్రస్తుతం శివ కార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత సల్మాన్ సినిమా స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది.అలాగే రణవీర్ సింగ్ కూడా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో అపరిచితుడు రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాలు చేస్తున్నాడు. వాటి తరువాత రణవీర్ తో చెయ్యనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: