సందీప్ కిషన్: హిట్ కోసం మాస్ లైనప్?

Purushottham Vinay
తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్.. ఇటీవల ఊరు పేరు భైరవకోన అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ కుర్ర హీరోకి లేటెస్ట్ గా మరీ అంత పెద్ద హిట్ దక్కకపోయినా యావరేజ్ హిట్ దక్కింది.వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా.. వసూళ్లు మాత్రం పెద్దగా రాలేదు. కానీ సందీప్ గత సినిమాలతో పోలిస్తే బెటర్ అనే ఫీలింగ్ మాత్రం వచ్చింది. అయితే ప్రస్తుతం ఓటీటీలో మాత్రం ఈ సినిమా అదరగొడుతోంది.ఇక సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేసే సందీప్ కిషన్.. ఇటు టాలీవుడ్ తో పాటు తమిళ భాష చిత్రాల్లో క్యామియో రోల్స్ చేస్తున్నారు. ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలో తన నటనతో పర్వాలేదు అనిపించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో మంచి లైనప్ ను సెట్ చేసుకున్నారు. మాయావన్-2 సినిమా షూటింగ్‌ ను పూర్తి చేశాడు. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కింది.తాజాగా సందీప్ కిషన్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇంకోటి వచ్చింది.


రవితేజ ధమాకా సినిమా దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో సినిమా చేయనున్నట్లు వస్తున్న వార్తలు నిజమయ్యాయి. సందీప్ కిషన్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన మంగళవారం నాడు వచ్చింది. ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్ల తర్వాత హ్యాట్రిక్ హిట్‌ కొట్టడానికి ఈ రెండు ప్రొడక్షన్ హౌస్‌ లు మళ్లీ జతకట్టాయి. ఇక త్రినాధ రావు నక్కిన, ప్రసన్న కుమార్ బెజవాడది మంచి సక్సెస్ కాంబోనే. ఇప్పటికే వీరిద్దరు కలిసి ధమాకా సహా చాలా బ్లాక్‌ బస్టర్‌ లను అందించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీకి ప్రసన్న కుమార్ కథ, స్క్రీన్‌ప్లే ఇంకా డైలాగ్‌ లను అందించనున్నారు.సందీప్ కిషన్ తన ల్యాండ్ మార్క్ మూవీలో నెవ్వర్ బిఫోర్ పాత్రలో కనిపించనున్నారు. హైక్వాలిటీ ప్రొడక్షన్, టెక్నాలజీ తో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాలో త్రినాథరావు నక్కిన, ప్రసన్న మార్క్ ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: