అప్పుడే ఓటిటి లోకి వచ్చేస్తున్న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్..!?

Anilkumar
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ సోలోగా హిట్ అందుకుని చాలా కాల‌మే అయిపోయింది. అత‌ని గ‌త చిత్రాలు గ‌ని, గాందీవధారి అర్జున బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని క‌సి మీద ఉన్న వ‌రుణ్ తేజ్‌.. రీసెంట్ గా ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. 2019 పుల్వామా టెర్రరిస్ట్ అటాక్ మరియు 2019 యొక్క ప్రతీకార బాలాకోట్ వైమానిక దాడుల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మాజీ మిస్ వ‌ర‌ల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది.

న‌వ‌దీప్‌, పరేష్ పహుజా, రుహానీ శర్మ, మీర్ సర్వర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సోనీ పిక్చ‌ర్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ బ్యాన‌ర్ల‌ పై రూ. 50 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఆప‌రేష‌న్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాష‌ల్లో విడుద‌లైంది. కానీ ప్రేక్ష‌కుల‌ను అంచ‌నాల‌ను ఈ చిత్రం ఏ మాత్రం అందుకోలేక‌పోయింది. తాజా సమాచారం ప్రకారం ఆపరేషన్ వాలెంటైన్ సినిమా డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకే సొంతం చేసుకుందని తెలుస్తోంది. సినిమా విడుదలైన తర్వాత 30 రోజులకు ఓటీటీలో రిలీజ్ చేయాలని

 డీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం మార్చి 29 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఏప్రిల్ మొదటివారంలో గ్యారెంటీగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే హిందీ వెర్షన్ మాత్రం మరింత ఆలస్యం కానుందని టాక్. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ప్రస్తుతం వరుణ్ మట్కా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరీ, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: