ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ అందుకున్న రామ్ చరణ్ దంపతులు..!!
గత నెల 28 నుంచి ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ ఈవెంట్ కి వరల్డ్ టాప్ పాప్ సింగర్ రిహన్న, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ వంటి ఇంటర్నేషనల్ పర్సన్స్ అతిథులుగా రావడంతో.. ఈ ప్రీ వెడ్డింగ్ గ్లోబల్ వైడ్ వైరల్ అవుతుంది.. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి ఇండియాలోని టాప్ స్టార్స్ కి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ స్టార్స్ ఈ సెలబ్రేషన్స్ కి గెస్ట్లుగా హాజరవుతున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన ఫ్యామిలీతో సహా కలిసి ఇప్పటికే జామ్ నగర్ కు చేరుకున్నారు.అయితే ఈ క్రమంలో రామ్ చరణ్ అండ్ ఉపాసనకి ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇన్విటేషన్ అందిందని, వారు ఇద్దరు కూడా ఆ సెలబ్రేషన్స్ కి వెళ్ళబోతున్నారని టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.ఇక ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే.. ఈ మ్యూజికల్ కాన్సర్ట్ పూర్తి అయిన తరువాత రోజు అతిథులతో జంగల్ సఫారీ ఈవెంట్ ఉండబోతుంది. ఆ నెక్స్ట్ డే జామ్నగర్ ప్రకృతి అందాలను అతిథులకు చూపించనున్నారు.. ఈ ఈవెంట్స్ కు ఎవరెవరు గెస్టులు గా రాబోతున్నారో తెలియాల్సి ఉంది.