యంగ్ టైగర్ ప్రాజెక్ట్ మహేష్ చేతికి ఎలా పోయిందో తెలుసా....??

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించు కోవడానికి అహర్నిశలు కష్ట పడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా గుర్తింపు పొందిన మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.అయితే ఈయన చేసిన సినిమాలన్నీ ఇప్పటివరకు సూపర్ సక్సెస్ లని సాధిస్తూ వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమా గా తెరకెక్కుతుంది. ఈ సినిమా భారీ హిట్టు సాధిం చడమే కాకుండా ఇప్పటివరకు ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డ్ లను బ్రేక్ చేస్తుంది అనే నమ్మకంతో సినిమా యూనిట్ ముందుకు కదులుతుంది. ఇక ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఇండియా లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరీయర్ మొదట్లో ఆయన చేసిన మురారి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.   అయితే ఈ సినిమా ను మహేష్ బాబు కి ముందు కృష్ణవంశీ జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నాడట కానీ ఈ సినిమా కథ కృష్ణ దగ్గరికి వెళ్లడంతో ఈ సినిమా ని మహేష్ బాబు తో చేయమని కృష్ణ కృష్ణవంశీ ని అడిగాడట దాంతో కాదన లేక పోయిన కృష్ణవంశీ మురారి సినిమాని మహేష్ బాబు తో చేశాడు. ఈ సినిమాతో మహేష్ బాబు మొదటి బ్లాక్ బాస్టర్ హిట్ ని అందు కోవడమే కాకుండా నటన పరంగా కూడా తనలోని వైవిద్యమైన నటనని కూడా ప్రదర్శించాడు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు నటుడుగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మొత్తా నికైతే జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన ఈ సినిమా ని మహేష్ బాబు తో చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: