మృణాల్‌ ఠాకూర్‌ పై అసహనం !

Seetha Sailaja
హిందీ సీరియల్స్ తో ఉత్తరాది ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన మృణాల్ ఠాకూర్ కు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె అక్కడ అంతగా రాణించలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య అనుకోకుండా ‘సీతా రామం’ మూవీతో ఆమె దశ తిరిగింది. ఆతరువాత నానీతో కలిసి నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ కూడ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో ఆమె ఇంచుమించు సెటిల్ అయిపోయింది.

త్వరలో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రభాస్ తో తీయబోతున్న మూవీలో ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకునే విషయం పై చర్చలు జరుపుతున్నాతు అంటే ఆమె స్థాయి టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఆమె నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ రాబోతున్న ఉగాది రోజున విడుదల కాబోతోంది. ఈసినిమా పై కూడ అంచనాలు బాగా ఉండటంతో ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి హీరోయిన్ గా బుక్ చేసుకోవాలని చాలామంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.

అయితే ప్రస్తుతం తెలుగు సినిమాల కంటే కోలీవుడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది అంటు వార్తలు రావడంతో టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు కొంత అసహనానికి గురి అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఆమె మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నిర్మాణం జరుపుకోబోతున్న మూవీతో పాటు తమిళ టాప్ హీరో అజిత్ తో కూడ ఈమె నటించ బోతున్నట్లు కాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలు టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ వర్గాలకు మరింత షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఉత్తరాదిలో ఏమాత్రం ఇమేజ్ లేని మృణాల్ ను నటిగా మార్చి గొప్ప ఇమేజ్ ని క్రియేట్ చేసింది ‘సీతా రామం’ మూవీ. దీనితో ఆమె తనకు ఎక్కువగా అవకాశాలు వస్తున్న తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీని కాదనుకుని కాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ వైపు ఎందుకులు అడుగులు వేస్తోంది అంటూ చాలమంది ఆశ్చర్య పోతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: