మెగాస్టార్.. ఓటీటీ ఎంట్రీ ఖరారైందా?

Anilkumar
ఇప్పుడంతా ఎక్కడచూసినా ఓటీటీల హవానే నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ లోని పెద్ద పెద్ద స్టార్లు కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఏవీ దొరక్కపోతే రియాల్టీ షోలు కూడా చేస్తున్నారు. ఆడియన్స్ కూడా ఓటీటీ కంటెంట్స్ కి అలవాటు పడిపోయారు. అందుకే యంగ్ యాక్టర్స్ తో పాటు సీనియర్ యాక్టర్స్ కూడా వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మన టాలీవుడ్ లో చూసుకుంటే గత కొంతకాలంగా ఓటీటీ కంటెంట్ కి బాగా డిమాండ్ పెరిగింది. అందుకే అగ్రతారలు సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు.  ఇప్పటికే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలు ఏదో ఒక రకంగా ఓటీటీల ద్వారా ప్రేక్షకులకు

దగ్గరవుతుండగా తాజాగా ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. చిరంజీవి ఇటీవల తన ఫస్ట్ వెబ్ సిరీస్ కి సైన్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. చాలాకాలంగా చిరు ఓటీటీ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. తన ఇమేజ్ కి సూట్ అయ్యే కంటెంట్ దొరికితే ఖచ్చితంగా వెబ్ సిరీస్ చేస్తానని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. చెప్పినట్లుగానే తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థలో వెబ్ సిరీస్ చేసేందుకు మెగాస్టార్ ఒప్పందం కుదురుచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అది ఎలాంటి సిరీస్, ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చేస్తున్నారనే విషయం ఇంకా తెలీదు కానీ సోషల్ మీడియాలో మెగాస్టార్ డిజిటల్ ఎంట్రీ కి

 సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మెగాస్టార్ ప్రస్తుతం 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందనున్న ఈ సినిమా ఇటీవల ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక తాజాగా హైదరాబాద్ లో మరో షెడ్యూల్ మొదలైంది. లేటెస్ట్ షెడ్యూల్లో చిరంజీవి, త్రిష లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాదులోని ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: