పల్లవి ప్రశాంత్ పై అందుకే కేసు పెట్టలేదు.. షాకింగ్ విషయం చెప్పిన అమర్దీప్?

praveen
సాధారణంగా ప్రతి ఏడాది కూడా బిగ్ బాస్ సీజన్ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అయితే గత ఏడాది జరిగిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాత్రం ఊహించని రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉల్టా పుల్టా అనే  కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీజన్.. టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంది. ప్రేక్షకుల ఊహకందని రీతిలో ఎన్నో ట్విస్టులు కూడా ఇక ఈ షోలో ఉండడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. అయితే బిగ్ బాస్ విన్నర్ గా కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ నిలిచాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే బిగ్ బాస్ ముగిసిన తర్వాత కూడా ఈ షో గురించి జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రన్నరఫ్ గా నిలిచిన అమర్, ఆయన కుటుంబ సభ్యులపై ముఖ్యంగా కారుపై దాడికి పాల్పడ్డారు. కేవలం అమర్ దీప్ కారును మాత్రమే కాదు మరి కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్ ల కారును పగలగొట్టారు అని చెప్పాలి.దీనిపై ఇక పెద్ద ఎత్తున గొడవ కూడా జరిగింది.అయితే అశ్విని,  గీతూ రాయల్ వంటి వాళ్ళు తమ కారు అద్దాలు పగలగొట్టినందుకు పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేశారు.

  అయితే అందరూ పోలీసులకు ఫిర్యాదు చేసిన అటు అమర్దీప్ మాత్రం తనపై జరిగిన దాడికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే ఇలా ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనే విషయంపై అమర్ దీప్ తొలిసారిగా స్పందించాడు. అమర్దీప్ స్నేహితుడు నరేష్ లొల్ల యూట్యూబ్ ఛానల్ కు ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చి అనేక విషయాలను బయట పెట్టాడు. తనపై దాడి జరిగిన క్షణం తనకేం అర్థం కాలేదని అప్పుడే తాను కారు దిగిపోతానని గొడవ చేసినట్లు గుర్తు చేశాడు. భార్య తల్లిని క్షేమంగా ఇంటికి తీసుకువెళ్తే చాలని నరేష్ లోల్లను అడిగినట్లు చెప్పుకొచ్చాడు. ఆ క్షణం తన ఫ్యామిలీని సేవ్ చేయడమే తనకు కావాలనిపించింది అంటూ తెలిపాడు. అందుకే రెచ్చగొట్టే మాటలు కూడా మాట్లాడలేదు. ఆ గొడవను మరింత పెద్ద చేయటం ఇష్టం లేకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. తన వల్లే పల్లవి ప్రశాంత్ అరెస్టు అయ్యాడు అన్నదాంట్లో కూడా ఎలాంటి నిజం లేదు అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: