గుంటూరు కారం తర్వాత.. గురూజి దారెటు?

praveen
ఇటీవల కాలంలో స్టార్ హీరోలకు సంబంధించి ఏ చిన్న విషయం లీక్ అయినా ఇక దానికి సంబంధించిన మిగతా విషయాలు కూడా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయ్ అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దారెటు అనే మాట వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమా చేశాడు త్రివిక్రమ్. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్తో సినిమా చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో అల్లు అర్జున్ అట్లీతో తన తర్వాత ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

 దీంతో ఇక గుంటూరు కారం తర్వాత బన్నీతో మూవీ చేయాలనుకున్న త్రివిక్రమ్ దారి ప్రస్తుతం ఎటువైపు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ మధ్య హాయ్ నాన్న సక్సెస్ మీట్ లో మీరు మల్టీ స్టారర్ చేయడానికి రెడీ నేనా అనే ప్రశ్నకు త్రివిక్రమ్ గారు వింటున్నారా అంటూ స్పందించాడు నాని. దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో నాని నెక్స్ట్ మూవీ ఉండబోతుంది అనే వార్తలు తెరమీదకి వచ్చాయి. అయితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో కోసం కూడా ఇక తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు  ఎందుకంటే మాటలు మాంత్రికుడి డైరెక్షన్లో తారక్ నటిస్తే ఆ సెన్సేషన్ ఎలా ఉంటుందో అరవింద సమేతలో చూసాం.

 ఇప్పుడు అంతకు మించిన మూవీ కోసం నందమూరి అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే దేవర షూటింగ్లో బిజీగా ఉన్న తారక్.. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ లో పాల్గొంటాడు. ఇది పూర్తయ్యాకే త్రివిక్రమ్ తో మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడా లేదంటే ఇక త్రివిక్రమ్, తారక్ కాంబో ఆల్రడీ స్క్రిప్ట్ రెడీ అయ్యి ఇక పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉందా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలా గుంటూరు కారం తర్వాత గురూజీ ఎటువైపు వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. దీనిపై అఫీషియల్ ప్రకటన వస్తే కానీ ఈ కన్ఫ్యూజన్ కు తెరపడదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: